సిఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరంలాంటిది.

నెరడిగొండ అక్టోబర్8(జనంసాక్షి):
ముఖ్యమంత్రి సహాయ నిధి పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగ పడుతుందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.                         శనివారం రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసములో బోథ్ నియోజకవర్గములోని  మండలాలకు చెందిన 31 మంది లబ్దిదారులకు 9,18,500 రూపాయల విలువ గల చెక్కులనుబోథ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు అందించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య ఫలాలే కాకుండా  దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కేసీఆర్ అమలు చేస్తున్నరని అన్నారు.ఈ కార్యక్రమములో బోథ్ నియోజకవర్గ నాయకులు  నెరడిగొండ ఎంపీపీ రాథోడ్ సజన్ మండల కన్వీనర్ శివారెడ్డి తోపాటు పలు మండల కన్వీనర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Attachments area