*సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీపీ*

మునగాల, సెప్టెంబర్ 30(జనంసాక్షి): మునగాల మండల కేంద్రంలోని సిపిఎం పార్టీ కార్యాలయం దగ్గరలో ఉన్న సర్వీస్ రోడ్డు నుంచి స్మశాన వాటిక వరకు నల్లగొండ పార్లమెంటు సభ్యులు కెప్టెన్ యన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపి నిధుల నుంచి మంజూరైన 15 లక్షల రూపాయలు వ్యయంతో తొమ్మిదవ వార్డులో సిసి రోడ్డు పనులకు స్ధానిక ఎంపిపి యలక బిందు ‌నరేందర్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్ధానిక సర్పంచ్ చింతకాయల ఉపేందర్, ఎంపిటిసి సభ్యులు ఉప్పల రజిత జానకిరెడ్డి, కాసర్ల కల్పన శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్వేత, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొప్పుల‌ జైపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఎలక నరేందర్ రెడ్డి, కాసర్ల కోటేశ్వరరావు, గ్రామ పెద్దలు నల్లపాటి శీనివాస్, దేవరం వెంకటరెడ్డి, మట్టారెడ్డి, నల్లపాటి నాగరాజు పలువురు వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.