సి ఐ శ్రీనివాస్ ఆధ్వర్యం లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన పోలీసులు

ఎల్లారెడ్డి, అక్టోబర్ 21 (జనం సాక్షి )
పోలీసు అమరవీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలో రాత్రి 7 గంటలకు సి ఐ శ్రీనివాస్ ఆధ్వర్యం లో  కొవ్వొత్తుల ర్యాలీ నీ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు పోలీసు అమర వీరులకు  జోహార్లు అంట్లు నినాదాలు చేశారు  అమరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు పోలీస్ అధికారులు పోలీసు అమర వీరుల త్యాగాలను కీర్తించారు. పోలీసు అమరులకు జోహార్లు అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో  యస్ ఐ. గణేష్  ,  కానిస్టేబుల్స్ రవి రాము  హాంగాడ్స్ విర ప్రసాద్  అక్బర్ తో పాటు యువజన సంఘాలు ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.