*సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం*

పెద్దేముల్ అక్టోబర్ 08 (జనం సాక్షి)
కొండాపూర్ గ్రామ పంచాయితీ కార్యాలయంలో సర్పంచ్ చంద్రయ్య ఆధ్వర్యంలో నూతన పెన్షన్ లబ్ధిదారులతో కలిసి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ… కొండాపూర్ గ్రామంలో నూతనంగా పెన్షన్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఋణపడి ఉంటామని అన్నారు.ఇంత మందికి పెన్షన్లు ఇచ్చినందుకు లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయితీ కార్యదర్శి నరేష్,వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు.