*సీఎం సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి గారు.*

దోమ న్యూస్ జనం సాక్షి.
 దోమ మండల పరిధిలోని మల్లేపల్లి తండాకు చెందిన *సీత భాయ్ కి రూ.3 లక్షల LOC* మంజూరు చేయించి వారి కుటుంబ సభ్యులకు అందజేసిన *పరిగి ఎమ్మెల్యే శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి గారు.*
సీత భాయ్ అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ లో చేరింది. ఈ విషయాన్ని గ్రామ నాయకులు ఎమ్మేల్యే మహేష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మేల్యే CMRF నుంచి రూ.3 లక్షల LOC ని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అందించారు.

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..* పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అండగా ఉంటున్నారని, అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న వారికి అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్, LOC లు అందజేయడం జరుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పరిగి మండల తెరాస పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు, గ్రామ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..