సీతారామం ప్రీ రిలీజ్‌ అట్రాక్షన్‌గా ప్రభాస్‌

పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ ’సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా హాజరవబోతున్నారు.
ఇక ఈ చిత్రాన్ని తెలుగు తో పాటు తమిళ, మలయాళ వెర్షన్స్‌ లోనూ విడుదల చేయబోతున్నారు. అయితే, విడుదల తేదీ దగ్గరగపడుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ ని మేకర్స్‌ నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈరోజు నిర్వహించబోయో గ్రాండ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పాన్‌ ఇండియన్‌ స్టార్స్‌ ప్రభాస్‌ గెస్టుగా హాజరవబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ మేకర్స్‌ సోషల్‌ విూడియా ద్వారా పోస్ట్‌ పెట్టారు. దీనిలో నేడు రాత్రి 7 గంటల నుంచి హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోలో ’సీతారామం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ మొదలవనున్నట్టు… దీనికి ముఖ్య అతిథిగా ప్రభాస్‌ విచ్చేయనున్నట్టు పేర్కొన్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్‌ కాబోతున్న ఈ మూవీ ఎలాంటి సక్సెస్‌ సాధిస్తుందో చూడాలి. మలయాళ
స్టార్‌ హీరో దుల్ఖర్‌ సల్మాన్‌ నటిస్తున్న రెండవ స్టైట్ర్‌ తెలుగు సినిమా ఇది. యుద్ధంతో రాసిన ప్రేమకథ దీనికి ట్యాగ్‌ లైన్‌. హనురాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్‌ కథానాయికగా, మరో స్టార్‌ హీరోయిన్‌ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించారు. స్వప్న సినిమాస్‌ బ్యానర్‌ పై, వైజయంతి మూవీస్‌ సమర్పణలో నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్‌ 5న థియేటర్స్‌ లో రాబోతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, సింగిల్స్‌, ట్రైలర్‌ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. ప్రకాష్‌ రాజ్‌, తరుణ్‌ భాస్కర్‌, మురళీ శర్మ, సుమంత్‌ , భూమిక ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలోని చాలా భాగం కశ్మీర్‌ లో చిత్రీకరించారు.