సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపండి

రాజధానిలో పాగా వేసిన
సీమాంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపండి
డిప్యూటేషన్లు రద్దు చేయండి : టీఎన్‌జీవో నేత స్వామిగౌడ్‌
హైదరాబాద్‌, జూలై 4 (జనంసాక్షి):
డిప్యుటేషన్‌ల పేరుతో తెలంగాణలో పాగా వేసిన ఉద్యోగులను వెనక్కి పంపాలని, ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్‌ అన్నారు. డిప్యూటేషన్‌ల పేరుతో తెలంగాణలో సీమాంధ్ర ఉద్యోగులు పాగావేశారని, 610 జీవో అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. సీమాంధ్రలో తెలంగాణ ఉద్యోగులు లేరనీ, వంద శాతం అక్కడి వారే ఉన్నారనీ ఆయన పేర్కొన్నారు. అదే తెలంగాణలోని ప్రాంతంలోని ఉద్యోగాల్లో తమకు హక్కుందంటూ ఇక్కడి వారికి ఉద్యోగాలు దొరక్కుండా చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలకు ఒడిగడ్తుందని, తెలంగాణలోని ఏ ఒక్క ఉద్యోగిపై చేయి పడ్డా పరిస్థితి తీవ్రంగా ఉంటుందన్నారు.