సుంకిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు ప్రారంభం

ముఖ్యఅతిథిగా హాజరైన పరిగి ఎమ్మెల్యే
 మహబూబ్ నగర్ ,సెప్టెంబర్ 10 ,(జనంసాక్షి) :  సుంకి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి  ప్రధమ వర్ధంతి సందర్భంగా సుంకిరెడ్డి సుధాకర్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో మహమ్మదాబాద్ మండలం చౌదర్ పల్లి గ్రామంలో  జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి .ఈ కార్యక్రయానికి పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ముఖ్య అతిథిగా  హజరై కబడ్డీ పోటీలను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మాట్లాడుతూ సుంకి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లేని లోటు తీరనిదని ,వారి స్మారకార్థం క్రీడలు నిర్వహించడం అభినందనీయం అన్నారు .శ్రీనివాస్ రెడ్డి  ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుంకిరెడ్డి ట్రస్టు ద్వారా పేదలకు  ఎన్నో వైద్య  సేవలందించారాని అయన కొనియాడారు  , ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు వివిధ క్రీడా రంగాల వైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు .క్రీడల వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు .ప్రతి ఒక్కరూ క్రీడలయందు ఆసక్తి చూపాలని అన్నారు .ఈ కార్యక్రమంలో పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి ,తెరాస సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి కూతురు రాఖీ రెడ్డి ,గ్రామ సర్పంచ్  వెంకటమ్మ కిష్టయ్య ,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బిక్షపతి ,మండల కో ఆప్షన్ మెంబర్ సలీం ,రైతు బంధు అధ్యక్షులు గిరిధర్ రెడ్డి ,తిరుమల్ రెడ్డి ,దేవుజ ,చందర్ నాయక్, చెన్నయ్య , యువకులు వివిధ గ్రామాల నుంచి వచ్చిన క్రీడాకారులు  పాల్గొన్నారు.