సెల్‌టవర్ ఎక్కిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు

నిజామాబాద్: ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సెల్‌టవర్ ఎక్కారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద క్రిష్ణమాదిగను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఎడవల్లి మండల కేంద్రంలోగల సెల్‌టవర్‌ను ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఎక్కి తమ నిరసనను వ్యక్తం చేశారు. కాగా… ట్యాంక్‌బండ్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించిన మంద క్రిష్ణమాదిగను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే.