సేవాలాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి):  సేవాలాల్‌  280 జయంతి సందర్భంగా మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో సాధువులతో కలసి లంబాడీలు  భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే  శంకర్‌ నాయక్‌ పాల్గొన్నారు. సేవాలాల్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బయ్యారం మండల కేంద్రంలో సేవాలాల్‌ సేన  ఆద్వర్యంలో సేవాలాల్‌ మహరాజ్‌ 280వ జయంతి కార్యక్రమం జరిగింది.. కార్యక్రమం లో ఖ గుగులోతు జయశ్రి గారు,మండా రాజన్న వేంకట్రాం పురం సర్పచ్‌ బానోతు రాము నాయక్‌ , జగ్గు తండా సర్పంచ్‌ బోడ రమేష్‌ నాయక్‌, భరత్‌ నాయక్‌  సేవాలాల్‌ సేన మహబూబాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య రవి నాయక్‌ , తేజవత్‌ రవీందర్‌ నాయక్‌ , తేజవత్‌ సురేష్‌ నాయక్‌, సేవాలాల్‌ ఉద్యోగ సేన రాష్ట్ర కార్యదర్శి ఆజ్మేర శంకర్‌ నాయక్‌ , సేవాలాల్‌ ఉద్యోగ సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆజ్మేర కోటేశ్వరరావు నాయక్‌, తదితరలు పాల్గొన్నారు.