స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలు
అనంతపురం,ఆగస్ట్‌10(జనంసాక్షి): అనంతపురం పట్టణం, క్లాక్‌ టవర్‌ దగ్గర ఆర్టీసీ బస్సు స్కూటీపై వెళుతున్న మహిళను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ఉన్న ఇద్దరు మహిళు గాయపడ్డారు. వారిని పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ దృశ్యాలు సీసీ పుటేజీలో రికార్డు అయ్యాయి. క్లాక్‌ టవర్‌ దగ్గర సిగ్నల్‌ పడడంతో బస్సు ముందుకు కదిలింది. అదే సమయంలో స్కూటీపై రాంగ్‌ రూట్‌లో వచ్చిన
ఇద్దరు మహిళలు బస్సు ముందుకు వచ్చారు. దీంతో స్కూటీ కనిపించకపోవడంతో బస్సు డ్రైవర్‌ ఢీకొట్టాడు. ముందు చక్రం మహిళల కాళ్లపై నుంచి వెళ్లడంతో ఇద్దరి మహిళల కాళ్లు విరిగాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు ఈ వీడియో జిల్లా వ్యాప్తంగా వైరల్‌ అయింది.