స్టార్‌ ప్రభాస్‌ చాలా గ్రేట్‌

బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ దిశా పటానీ
’పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ చాలా గ్రేట్‌‘ అంటోంది బాలీవుడ్‌ గ్లామర్‌ బ్యూటీ దిశా పటానీ . పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన ’లోఫర్‌’ సినిమాతో టాలీవుడ్‌కి హీరోయిన్‌గా పరిచయమైన దిశా మొదటి సినిమాతో తన అందచందాలతో బాగానే ఆకట్టుకుంది. అయితే, ఈ సినిమా ప్లాప్‌ కారణంగా మళ్ళీ ఇప్పటి వరకు తెలుగులో కనిపించలేదు. కానీ, బాలీవుడ్‌లో మాత్రం మంచి గ్లామర్‌ పాత్రలు చేస్తూ సత్తా చాటుతోంది. అక్కడ క్రేజీ ఆఫర్స్‌ అందికుంటున్న దిశా పటాని..ఏకంగా పాన్‌ ఇండియన్‌ స్టార్‌ ప్రభాస్‌ తో కలిసి నటించే అవకాశం అందుకుంది.ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న భారీ చిత్రాలలో పాన్‌ వరల్డ్‌ మూవీ ప్రాజెక్ట్‌ ఐ కూడా ఒకటి. ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ దీపిక పడుకొన్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో అగ్ర నిర్మాత సి అశ్వనీదత్‌ నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్‌ ఐ ఈ సంస్థలో తెరకెక్కుతున్న 50వ సినిమా కావడం విశేషం. అందుకే మేకర్స్‌ ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా చిత్రాన్ని రూపొందిస్తున్నారు.అయితే, ఈ మూవీలో దిశా పటానీ కూడా ఓ పాత్రను చేస్తున్నారు. తాజాగా దీనిపై మాట్లాడిరది దిశా. ప్రస్తుతం తన కొత్త చిత్రం ’ఏక్‌ విలన్‌ 2’తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదలకానున్న నేపథ్యంలో..మేకర్స్‌ ప్రమోషన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా విూడియా వారు దిశా ని ఒక ఆసక్తికర ప్రశ్నను అడిగారు.
’ప్రాజెక్ట్‌ ఐ’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించడం విూకు ఎలా అనిపించింది ? అని అడిగిన ప్రశ్నకు దిశా సమాధానమిస్తూ.. ‘నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటుల్లో ప్రభాస్‌ ఒకరు. ప్రభాస్‌ చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయనతో నా మొదటి రోజు షూట్‌ నాకు ఇప్పటికీ గుర్తుంది. ప్రభాస్‌ నాకు ఆ రోజు తన ఇంట్లో తయారు చేసిన ఫుడ్‌ ను తీసుకువచ్చి ఇచ్చారు. మా సినిమా టీమ్‌ మొత్తానికి ప్రభాస్‌ ఫుడ్‌ తీసుకొచ్చారు. ప్రభాస్‌ చాలా గ్రేట్‌’.. అంటూ.. చెప్పుకొచ్చింది. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రభాస్‌ సినిమాతో టాలీవుడ్‌లో కనిపించబోతున్న దిశా దశ తిరుగుతుందేమో చూడాలి.