హనీ ట్రాప్‌ ముఠా అరెస్ట్‌


కర్నూలు,అగస్టు23(జనంసాక్షి): నగరంలో హనీ ట్రాప్‌ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహిళలతో చనువుగా ఫోన్‌ చేయించి ఇంటికి పిలిపించుకుని అర్ధనగ్న ఫోటోలు తీసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న 5 మంది ముఠా సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 4 లక్షల విలువైన 2 ప్రాంసరి నోట్లు, 4 లక్షలు విలువైన 2 చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.