” హర్ ఘర్ తిరంగ్” కార్యక్రమం విజయవంతం చేయాలి: జక్కం రమేష్

పినపాక నియోజకవర్గం ఆగస్టు 10 (జనం సాక్షి): ” హర్ ఘర్ తిరంగ్” కార్యక్రమంలో భాగంగా జిఎం కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ చేతుల మీదగా సింగరేణి ఉద్యోగులకు కాంట్రాక్ట్ కార్మికులకు జాతీయ జెండాతో పాటు జెండా ఆవిష్కరణ నియమ నిబంధనల కర పత్రములు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జక్కం రమేశ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని భారత్ కా అమ్మత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా చైర్మెన్ అండ్ మెనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ ఆదేశాల మేరకు సింగరేణి యాజామాన్యం “హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఏరియాలోని సింగరేణియులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులు కూడా జెండాలను పంచడం జరుగుతోంది. క్రమ పద్ధతిలో ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఆవిష్కరించడం వల్ల మన ఐక్యత, శక్తి, దేశ భక్తి చాటినట్టు అవుతుంది. అలాగే రేపటి తరానికి జెండా యొక్క విశిష్టతను తెలియజెప్పి వారిలో దేశ భక్తి కలిగించిన వారవుతాము. “హెర్ ఘర్ తిరంగ” కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడం భారతీయులుగా మనందరి భాద్యత ఈ నెల 13 నుంచి15 వరకు తమ తమ ఇండ్లపై జాతీయ పతాకావిష్కరణ నిబంధనలు పాటిస్తూ మణుగూరు ఏరియా సింగరనీయులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు జాతీయ జెండాను తప్పనిసరిగా ఎగురవేయ్యాలని ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటల నుంచి పివి కాలనీ సింగరేణి కాలరీస్ ఏరియా హాస్పిటల్ నందు సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించబడే రక్త దాన శిబిరం కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ టు జిఎం డి లలిత్ కుమార్ , ఏజిఎం(ఈ&ఎం) ఫిట్జ్ గెరాల్డ్ , ఏజిఎం(సివిల్) వెంకటేశ్వర్లు , ఏఎస్ వెంకట రమణ, డిజిఎం (ఐఈడీ) కే వెంకట్ రావు , డిజిఎం (పర్సనల్) ఎస్ రమేశ్ , టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ వి ప్రభాకర్ వాష్ మూర్తి , సీనియర్ పర్సనల్ అధికారులు సింగు శ్రీనివాస్ , పర్యావరణ అధికారి జే శ్రీనివాస రావు , సీనియర్ సెక్యూరిటీ అధికారి అబ్దుల్ షబ్బీరుద్దీన్ , సంక్షేమ అధికారి నరేశ్ , టిబిజికెఎస్ యూనియన్ నాయకులు కోట శ్రీనివాస రావు , శ్రీ అబ్దుల్ రవూఫ్ , పిఏ టు జిఎం రాం బాబు , జిఎం ఆఫీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు