హెడ్కానిస్టేబుల్‌కు ఎస్పీ అభినందన

గుంటూరు,ఆగస్ట్‌18(జనంసాక్షి): బీటెక్‌ విద్యార్థిని రమ్య హత్య కేసు నిందితుడు శశికృష్ణను పట్టుకున్న కానిస్టేబుల్‌ రఫిక్‌ని రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ అభినందించారు. హత్య జరిగిన సమయంలో కానిస్టేబుల్‌ చూసి కాలువలో దూకి పారిపోయేందుకు శశికృష్ణ ప్రయత్నించాడు. తర్వాత ఆత్మహత్యయత్నానికి నిందితుడు యత్నించాడు. కాగా శశికృష్ణ బెదిరింపులకు లొంగకుండా కానిస్టేబుల్‌ రఫికి అత్యంత చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నాడు. రఫికిని అభినందించిన రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్నీ….కానిస్టేబుల్‌కు రూ.5000వేల నగదు, ప్రశంసాపత్రాన్ని అందజేశారు.