హోంగార్డ్ కుటుంబానికి ఆర్థిక చేయూత

పానుగల్ సెప్టెంబర్ 07, జనంసాక్షి
 మండల కేంద్రానికి చెందిన హోంగార్డ్ విష్ణు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకొని, ఎస్సై నాగన్న మరియు పోలీస్ సిబ్బంది కలిసి హోంగార్డ్ విష్ణు కుటుంబాన్ని పరామర్శించి, 20,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకాల మరణం చెందిన హోంగార్డ్ విష్ణు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నట్లు తెలిపారు.అదేవిధంగా ఆకుటుంబానికి తమ వంతు ఆర్థిక సాయం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.