ఉద్యోగాల పేరుతో 30లక్షలకు టోకరా

వనపర్తి : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.30లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. పాన్‌గల్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన శివయ్యచారి బీసీ వెల్పేర్‌లో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని 25 మందిని నమ్మించాడు. ఒక్కొక్కరి నుంచి 4లక్షల రూపాయల చొప్పున వసూలు చేశాడు. ఇటీవల నకిలీ నియామక పత్రాలు కూడా ఇచ్చాడు. అందులో ఉన్న చిరునామా ప్రకారం అక్కడికి వెళ్లిన యువకులకు అసలు విషయం తెలిసింది. దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు స్థానిక పోలీసులను ఆశ్రయించారు.