*57 వ రోజుకు చేరిన వీఆర్ఏల ధర్నా*

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 19 (జనం సాక్షి);
 డిమాండ్ల సాధనకై వీఆర్ఏల నిరసన దీక్షలు శనివారం తో 57 వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. గత 57 రోజులుగా విధులు వదిలేసి నిరవధిక సమ్మెలో కూర్చున్నప్పటికి  ప్రభుత్వం స్పందించడం లేదని వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ నాయకులు లక్ష్మణ్,మండల అధ్యక్షులు ఈశ్వర్ , మమత, బడే సాబ్, విజయుడు, బుచ్చన్న, కృష్ణ, బీచుపల్లీ, పాండు,వివిధ గ్రామాల వి ఆర్ ఎ లు  పాల్గొన్నారు.
Attachments area