ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కిందుర్గు మండలం తంగెళ్లపెల్లి వీఆర్వో రాజేందర్‌ ఓ వ్యక్తి నుంచి రూ. 3వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.