రాజ్యవాదమే రాజ్యాంగవాదంగా విస్తరిస్తోందా?

ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే రాజ్యాంగాన్ని పక్కన బెట్టి బలపడుతున్న రాజ్యం ప్రజల మీద దమన నీతిని ఎలా అమలు చేస్తున్నదో వివరిస్తున్నారు
ఇప్పుడు రాజ్యవాదమే రాజ్యంగ వాదంగ మారిపోతునం& విచారకర సందర్భం మనముందు ఉంది. తద్వారా ప్రభుత్వాలు తన జాతి జనం మీద జరిగే చట్టబద్ద హననానికి సాక్ష్యంగా మిగిలిపోతెఉన్నాయి. నిజానికి ప్రజల సంక్షమం దేశ అభివృద్ది కోసం ఉపకరించాల్సిన రాజ్యాంగం క్రమంగా రాజ్యంగవాదంగా ఆ తర్వాత రాజ్యాంగవాదం మాత్రమే మిగిలిపోయి చట్టసభలను మల్టీనేషనల్‌ కంపెనీలకుదాసోహం చేయించే పరిస్థితిలోకి దిగజార్చివేశాయి. చివరకు ఈ క్రమంలో అనేక జాతులు రాజ్యవాదం చేసే హననం కింద కనీస మనగడను కోల్పోవాల్సిన విచారకఱ పరిస్థితులు ఇప్పుడు ఆసియా ఖండంలోని అన్ని దేశాలలో ఏర్పడ్డాయి. ఆసియా ఖండంలోని తొమ్మిది దేశాలలో రాజ్యాంగాలు వలసవాద ప్రబావం నుంచి తప్పించుకోలేకపోయాయన్న సత్యం క్రమంగా నిర్ధారించ బడుతోంది. ఆయా దేశాల రాజ్యాంగ రూపకర్తలు వలసవాద ప్రభావం నుండి తప్పించుకోలేకపోయారని ఇటీవల పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. అందుకనే మళ్లీ మళ్లీ రాజ్యాంగ సవరణలతో రాజ్యంగానికి పదును పెట్టుకోవాలని యోచిస్తున్నాయి. అయితే ఈ క్రమంలో అంతకంతకూ అవతి ప్రజలకు దైరంగా జరుగుతున్నాయి ఆయా దేశాలలోని అధికారిక ప్రభుత్వాలు రాజ్యంగాన్ని ఒక స్పూర్తిగా కాకుండా నమ్మకంగా ప్రచారం చేసుకుంటూ ఆచరిం చడమే దీనికి కారణం. అయితే దీనిని తత్వశాస్త్రం మాత్రం అంగీకరించడంలేదు. తమను న్యాయసూత్రాలతో నిబంధించే శక్తిగా రాజ్యాంగాన్ని ప్రభుత్వాలు పేర్కొంటూనే, తాము దానికమీద ఆధాపడాల్సిన సంస్థలుగా ఉండడం తమ వల్లకాదని రాజ్యాంగమే తమ అధికారాలకు గొడుగుపట్టేదిగా ఉండాలని యోచించి ఆచరణలో నిరూపిస్తున్నారు. అయితే రాజ్యాంగం మాత్రం ప్రజల భద్రతకు సంక్షేమానికి, సమ భారా ఆచరణకు మార్గాచరణా భావిటవొస్త్రంచడంలో ఆయా దేశాలలోని పలకులు పక్కా ప్రణాళి కతో వెనుకడుతున్నారు. తమ స్విన్‌ ఖాతాలు పెంచుకోవడం ద్వారా రాజ్యంగ వాదాన్ని కాస్త రాజ్యంగవాదంగా మార్చేశారు. నిజాని4కి రాజ్యంగవాదం రాజ్యంగ నీతి అనేవి ఒకే నాణేనికి ఉన్న బోమ్మాబోరుసుల వంటివి కానీ రాజ్యాంగ నీతి అనేది ఆచరణ ద్వారా రాజ్యంగానికకి మంచి పేరును దెస్తుందనే భావనను భారత రాజ్యంగ రచనా సంఘ చైర్మయ న్‌గా డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ పేర్కొన్నాడు. రాజ్యాంగం ప్రజలందరికీ స్వేఛ్చాభావనను, సయం గౌరవాన్ని కోరుకుంటున్నది గౌరవం అనేది అలందరికీ వర్తించాలన్న సత్యమూ ఇందులో ఇమిడది ఉంది. అయిఈరతే రాజ్యంగ ఆచరణలో మాత్రంఅది తలకిందులవుతోంది. ఆచరణలో సార్వభైమధికారం పాలకపార్టీ ల ఆధిపత్య సంస్కృతిప్రలందరిపై రుద్దడానికి ఎక్కువగా ఉపకరించింది దప్ప సమ న్యాయం సమభావం పెంపోందింప జేయడంలో ఆయా రాజకీయ పార్టీఉ తమ స్వభావాన్నే రాజ్యంగ స్వభావంగా దిగజర్చేసిన సందర్భాలు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. విచిత్రంగా న్యాస్ధాథనాలు కూడా చాలా సందర్భాల్లో రాజ్యంగ నీతిని గుర్తించండలలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. అనేక సందర్బాల్లో ఇది నిర్ధారించబడుతోంది. కూడా వెరిసి ఇప్పుడు ఆసియా ఖండంలోని అన్ని దేశాల్లో రాజ్యంగవాదొస్త్రం రాజ్యవాదంగా మారిపోతోంది. రాజ్యంగనీతి ఆచరణను పక్కనబెట్టి రారాజ్యవాదం గా మారిపోవడం ఒకెత్తయితే దానిని ఇరుగుపొరుగు దేశాల ప్రతికూల విధనాలకు ప్రబావితం అయ్యేలా మారడం మరో కొత్త పోకడగా దారితీసింది. తద్వార ఆసియా తన ఉపఖండంలో తానే తనకు శత్రువుగా మిగిలిపోయే విచారకర పరిస్థితులు ఏర్పడు తున్నాయి. దీనికి సావకాశాన్ని కల్పిస్తున్నవి ఆయా రాజ్యంగ వాదాలేనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. రాజ్యంగాన్ని గొప్పదిగా అభివర్ణించుకుంటూ ఉండిపోవడం ఒక పద్దతి ఈరెండింటిలో రెండవదానికి ప్రజల్లో ఎక్కువ ప్రాధాన్యం ఉంది. కానీ విచిత్రంగా ఆయ దేశాల్లో నెలకొనిఉన్న రాజకీయపార్టీలు అధికారం చేబుచ్చుకచుంటున్న వాళ్లు మొదటిదానికి ప్రాధాన్యమిస్తూ రాజ్యంగ వాదాన్ని పూర్తిగా రాజ్యవాదంగా దిగజార్చి రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచేస్తున్నారు. తూర్పు ఆశియాలోని 9 దేశాలు రాజ్యంగనీనతిని ఆచరణ మార్గంగా స్వీకరించనందువల్లనే ఆయా దేశాలు అనేక ఉద్రిక్తలకు నెలవుగా మారాయి. ఆఫ్ఘనిస్తాన్‌ , బంగ్లాదేశ్‌, భూటాన్‌, భారతదేశం, మాల్దీవులు, మయన్మార్‌, నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంకలలో పెచ్చరిల్లుతున్నఅనేక రకాలైన ఉద్యమాలకు ఇదే కారనంగా భావించవచ్చు అయితే ఆయా రకాలైన ఉద్యమాలకు ఇదే కారణంగా భావంచవచ్చు. అయితే ఆయా దేశాల సంస్కృతులను గౌరవించుకుంటూనే అణచివేతలకు వ్యతిరేకంగా ఆయా దేశాలలోని ప్రజలు ఆందళలు చేస్తున్నారు. నిజానికి ఆసియా దేశాలలోని జ్రల మధ్యచ రాజ్యంగవాదం కావాలనే ఉన్న వైరుధ్యాలను పెంచి పోషంచడం ద్వారా కలహాలను సృష్టించి దేశాల మధ్య కలహా విస్తరణను రాజ్యాంగవాదం పోషిస్తోంది. తద్వారా తననుతాను రాజ్యవాదంగా మరదిదగా పాలకుల ప్రయోజనాలను నెరవేరుస్తోంది. అయితే ఈ సంస్కృతులన్నింటకీ మధ్య వారధిగా కళలు సాహిత్యం నిలుస్తున్నాయి. అందుకనే ఇరుగు పొరుగు దేశాలలో స్ధానిక మతోన్మోదులు దాడులు చేయడం దానికి ప్రభుత్వాలు మౌనం వహించి వత్తాసు పలకటం దేశ బహి ష్కారం చేయడం ఇదంతాద మతాలు కులాఉ రాజ్యంగ వాదాల మధ్య పరస్పర సహ్‌కారంతో జరిగి పోతుం డడం దీనికి రాజ్యాం గవాదం అని పేరు పేరు పెట్టుకోడం రాజ్యవాద కుట్రలో భాగంగానే భావించాల్సి ఉంటుంది. తూ ర్పు ఆసియా దేశా లలో ఉన్న ఆర్ధిక పరిస్థితులు, ప్రాంతాల మధ్య నెలకొని ఉన్న వ్యత్యా సాల కారణంగా పెచ్చురిల్లు తున్న ఒత్తిడులు కొత తగ్గించడానికి చర్చలు చేప డుతున్నప్పటికీ పూర్తిస్ధాయిలో రాజ్యాంగ లక్ష్యాలు నెకవేరడం లేదు అదే క్రమంలో ప్రపం చీకరణ పరిణామయాఉ ఆయ దేశాల ఆర్ధిక స్థితిగతులను అనిశ్చితికి గురి చేస్తున్నాయి. అయితే ప్రాంతాల మద్య సంస్కృతుల మధ్య సయోధ్య కుదిర్చి సంయమనం కల్పించ డానికి ఆయా దేశాల ఆర్ధిక పరిస్ధితులు చేస్తున్న కృషి కనిష్టమేనని చెప్పాలి స్ధానిక అస్తిత్వ ఉద్యమాలు స్వయం గౌరవం కోష్ట్ర్సం పెచ్చరి ల్లుతున్న ఆందోళన ఇప్పుడు ఆసియాలోని అన్ని దేశాలనూ ఆందోళనకు గురి చేస్తున్నాయి. దీనికి అనుగుణంగా రాజకీయ ఎజెండాలు కూడా రూపుదిద్దుకుంటున్నాయి. ఎజెండాకు అనుగుణంగా రాజ్యంగ వసరణల కోసం కొరుతున్నాయి. ఈ తీగలగుడు వ్యవహారం బ్యాలెట్‌ డబ్బా వరకే విస్తరిస్తోంది. ఆ తర్వాత కనిపించడంలేదు. నిజానికి ఇలాంటివాతావరణాన్ని సృష్టిస్తున్నవి వలసవాద భావజాలాలే.. ఎక్కడికక్కడ స్వయం గౌరవం కోసం స్వేఛ్చ సమానత్వం కోసం పెచ్చరిల్లుతున్న ఉద్యమాలను అణచివేయడం తప్ప పరిష్కార మార్గాలు ఆలోచించుఏ ధోరణికి వలసవాదం కృషి చేయడం లేదు, సరికదా అణచివేతకే అధికశాతం మొగ్గుచూపుతోంది. ఇటు ఇండియాలో కానీ, అటు సిలోన్‌లో కానీ, ముసురుతున్న మతవాదం నుంచి ప్రజల్ని విముక్తి చేసేలా ఆయా దేశాల్లో రూపు దిద్దుకున్న రాజ్యాంగవాదం. ఆచరణవంతమైన మార్గాలను సూచించలేక పోవడానికి కారణం అది రాజ్యవాదంగా మరిపోవడమే. రాజ్యాంగ అక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలను నీరుగార్చిన అనేక మతాలు, సంఘటలను మనం భారతదేశంలో చవిచూస్తూనే ఉన్నాం. చివరికి ప్రభుత్వాలు పౌరుల ప్రాథమిక హక్కులను సైతం నిరాకరించే దశకు చేరుకున్నాయి. ఇటువంటి విపత్కర పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో పుష్కలంగా దాపురించాయి. భారత రాజ్యాంగ వాదం రాజ్యవాదంగా మారిపోయి ప్రభుత్వాలకు అసాధారణ అధికారాలు కట్టబెట్టేవిధంగా తయారయ్యింది. పౌరుల ప్రాథమిక హక్కులను సైతం నిరాటంకంగా హరించే విధంగా ప్రభుత్వాలు తయారు కావడం విస్తుగొలిపే అంశం. 1960 ప్రాంతం నుండే తూర్పు ఆసియాలోని అన్ని దేశాలలో రాజ్యంగవాదం రాజ్యవాదంగా వేగంగా రూపాంతరం చెందడం ప్రారంభమయింది. ఇప్పటిదాకా ఐదు దశాబ్దాల పాటు ఇదే ధోరణి కొనసాఉతుండడం వల్లనే ప్రస్తుతం మన దేశంలో తీవ్ర అనిశ్చితి పరిస్థితి నెలకొనివున్నాయి.

-డాక్టర్‌ నూకతోటి రవికుమార్‌