ఎమ్మెల్యే సోదరుడి దారుణ హత్య

మహాబూబ్‌ నగర్‌ : జిల్లాలోని దేవరకద్ర మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ తమ్ముడు జగన్మోహన్‌రెడ్డిని దుండగులు దారుణంగా హత్య చేశారు. ద్విచక్రవాహనంపై వచ్చిన దుండగులు జగన్మోహన్‌ను కాల్చి చంపారు. అతని స్వగ్రమంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యమే ఈ హత్యకు కారణమై ఉండవచ్చు అని భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలిస్తున్నారు.