భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి తీసింది

పాన్‌గల్‌: మండలంలోని తెల్లరాళ్లపల్లి తాండాకు చెందిన పార్వతి (28)ని ఆమె భర్త విజయ్‌ శనివారం రాత్రి హత్య చేశాడు. తాండా వాసులు, ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం కుటుంబంలో భార్యభర్తల మధ్య కలహాలే ఈ దారుణానికి దారి తీసి ఉండవచ్చని తెలిపారు. వనపర్తి సీఐ గిరిబాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరిస్తున్నారు.