భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిం మహిళలు

ఝాన్సీ రాణి వెన్నంటి నిలిచి ప్రాణాలర్పించిన యోధురాలు

ముందర్‌

1857 నాటి గ్రామంలో మాతృభూమిని బ్రిటిష్‌ పాలకుల నుండి విముక్తి చేయడానికి కులమతాలకు అతీతంగా ప్రజలు పోరులో పాల్గొన్నారు. ఆయా ప్రాంతాలలోని స్వదేశీ పాలకుల పక్షాన తిరుగు బాటు చేసిన యోధులు చివరి వరకు తమ ప్రాణాలను పణంగా పెట్టి నాయకుల వెంట నడిచారు. చివరకు ప్రాణాలను కూడా తృణప్రా యంగా భావించి త్యజించారు. ఆ విధంగా పోరుబాటలో నడిచి అమరత్వం పొందిన ముస్లిం యువతులలో ఝూన్సీ రాణి లక్ష్మీబాయి నీడలా వెన్నంటి నిలచి శత్రువుతో పోరాడిన ఓ సాహస యువతి కథనం తెలుస్తుంది. ఆమె పేరు ముందర్‌.

ఝూన్సీ రాణి లక్ష్మీబాయి అమరత్వం పొందిన తీరు గురించి ప్రధానంగా రెండు కథనాలు ఉన్నాయి. ఆ కథనాలలో ఒకటి రాణి లక్ష్మీబాయి బ్రిటిషర్ల తుపాకీ గుండ్లక బలైందన్నది. ఈ విషయాన్ని చాలా మంది చరిత్రకారులు అంగీకరిస్తున్నారు. ఆ కథనం ప్రకారం ఝూన్సీ రాణి లక్ష్మీబాయికి అంగరక్షకుల్లా ఇరువురు యువతులు మగ వేషాల్లో ఆమెను ఎల్లప్పుడూ వెన్నంటి ఉండేవారు. ఆ ఇద్దరిలో ఒకరు ముస్లిం యువతి, ఆమె రాణితో పాటు బ్రిటిష్‌ సైనికాధికారుల తుపాకి గుళ్ళకు బలయ్యారు. అప్పటి సెంట్రల్‌ ఇండియా ప్రాంతాని కి గవర్నర్‌ జనరల్‌ ప్రతినిధిగా నియమించబడిన రాబర్ట్‌ హెమిల్టన్‌ 1858 అక్టోబర్‌ 30న అప్పటి భారత ప్రభుత్వ కార్యదర్శి ఎడ్‌సన్‌కు ఒక లేఖ రాశారు.

ఆ లేఖలో రాణి లక్ష్మీబాయి మీద తాము సాధించిన విజయాన్ని వివరించాడు. రాణి లక్ష్మీబాయి ఏ విధంగా మరణించింది వివరం గా తెలిపాడు. ఆ కధనం ప్రకారంగా, రాణి వెన్నంటి ఒక ముస్లిం యువతి గుర్రం మీద అనుసరించేది. కొఠాకి సరాయి ప్రాంతంతో రాణితోపాటుగా ఆమెకు తుపాకి గుండ్లు తగిలాయి. ఆమె రాణితో పాటుగా ఒకేసారి నేలకొరిగిందని వివరించారు.

ఆ విషయాన్నిEIGHTEENFIFTY SEVEN గ్రంథంలో డాక్టర్‌ సురేందరర్‌ సేన్‌ ఆంగ్లేయాధికారి రాబర్ట్‌ హెమిల్టన్‌ వివరణను ఉటంకించారు.
(The Rana was on Horse back, and close to her was the female (a Mohomaden) who seems never to have left  her side on any occasion, these two were struck by bullets and fell)ఈ లేఖలో ఎక్కడా కూడా ఆ యువతి ఎవరన్న విషయం ప్రస్తావించలేదు.

ఆ కారణంగా ఆమె అజ్ఞాత యోధురాలుగా మిగిలిపోయింది. భారత ప్రభుత్వం 1973లో ప్రచురించిన షష్ట్రశీర షష్ట్రశీ Iఅసఱaఅ వీaత్‌ీవతీర  లో మాత్రం ఝూన్సీ రాణితో పాటుగాపలు పోరాటాలలో పాల్గొన్న ఆ ముస్లిం మహిళ గురించిన సంక్షిప్త వివరాలను డాక్టర్‌ పియస్‌ ఛోప్రా ఈ క్రింది విధంగా పేర్కొన్నారు.

Fought by the side Maharani Lakshmi Bai during the battles against the British  at Jhansi, koonch, kapi and Gwalior, killed in the battle at kotah-ki-sarai in Gwalior, where the Rani attained martyrydom. Her Body was also cremated in the garden of baba Ganga Das Gwalior on June 17, 1857 whos who of Indian Martyrs, govt of india publications, New Delhi 1973.

ఆ యోధురాలి పేరు ముందర్‌ అని డాక్టర్‌ ఛోప్రా పేర్కొన్నారు. ఈ వివరణలను, చరిత్ర గ్రంధాలలో వ్యక్తం అవుతున్న కథనాలకు అన్వయించుకుని చూస్తే ఆ అజ్ఞాత యోధురాలు పేరు ముందర్‌ గా భావించవచ్చు.

బ్రిటిష్‌ సైనిక మూకలను సాయుధంగా ఎదుర్కొన్న ధైద్యశాలి

బేగం రహీమా

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ా, మాతృదేశాభిమానులైన ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీలో త్యాగాల బలివేదికను ఆనందంగా అధిరో హించగల సాహసాన్ని ఆత్మార్పణా స్ఫూర్తిని కలుగచేసింది. ఆ వీరగుణం కొందర్ని వ్యక్తిగత సాహసాలకు పురికొల్పితే మరికొందర్ని ఉమ్మడి పోరాటాలకు సన్నద్దులను చేసింది. ఈ మేరకు బ్రిటిష్‌ సైనికదళాల మీద ఉమ్మడి పోరాటాలకు సన్నద్ధులను చేసింది. ఈ మేరకు బ్రిటిష్‌ సైనికదళాల మీద విరుచుకుపడ్డ తిరుగుబాటు దళాలతో కలసి పోరుబాటను ఎంచుకున్నారు బేగం రహీమా.

ఆమె ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్‌పూర్‌ జిల్లాకు చెందిన రాజపుత్రుల కుటుంబంలో 1829లో జన్మించారు. రాజపుత్రుల శౌర్యప్రతాపాలు సంతరించుకున్న ఆమె స్వాతంత్య్ర సంగ్రామంలో బ్రిటిష్‌ సైనిక మూకల మీద సమర శంఖరావం పూరించారు. ఆయుధం ధరించి తిరుగుబాటు దళాలతో శత్రుమూకలను సంహ రించే కార్యక్రమంలో ఉత్సాహంగాఇ పాల్గొన్నారు.

ఈ పోరులో గాయపడిన ఆమె బ్రిటిష్‌ సైనికాధదికారులకు బందీ అయ్యారు. శత్రువు గుప్పెట్లో ఉన్నా, ఏ మాత్రం తలవంచని ఆ యోధురాలికి సైనికాధికారులు ఉరిశిక్ష విధించారు. మాతృదేశం కోసం మరణించటం అత్యంత గౌరవంగా భావించిన బేగం రహీమా చిన్న వయస్సులోనే, పుట్టిన గడ్డకోసం ప్రాణానలు అర్పించారు. ఈ తరువాతి తరం విప్లవ కారులు ఆమె ఆదర్శంగా నిలిచారు.

(whos who of Indian Martyrs, govt of india publications, New Delhi 1973)

తిరుగుబాటుయోధుల క్షేమం కోరుతూ అగ్నికి ఆహుతైన

అస్గరీ బేగం

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో మాతృభూమి పట్ల తెగని బంధాన్ని పెంచుకున్న ప్రతి ఒక్కరూ అపూర్వమైన త్యాగాలతో చిరస్మరణీయులయ్యారు. అటువంటి త్యాగధనులలో తిరుగుబాటు యోధుల క్షేమం కోరుకుంటూ తనను తాను బలి చేసుకున్న త్యాగ శీలి శ్రీమతి అస్గరీ బేగం.

1811 జులై 5న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం ముజఫర్‌పూర్‌ జిల్లాలో అస్గరీ బేగం జన్మించారు. ఆమె కుటుంబం ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామయోధుల కుటుంబం. 1857 నాటి పోరాటంలో పాల్గొన్న ఖ్వాజీ అబ్దుల్‌ రహిమాన్‌ ఆమె కుమారుడు, అబ్దుల్‌ రహిమాన్‌ను బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరితీసింది. ఆ తిరుగుబాటులో ఆమె కూడా పరోక్షంగా పాల్గొన్నారు. ఆ సంగ్రామంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తన బిడ్డలేనని భావించిన ఆమె తిరుగుబాటు వీరులకు ఆశ్రయం కల్పించడం, ఆహార పానీయాలు అందించడంలో సమాయపడ్డారు.

ఈ విషయం తెలిసిన ఆంగ్లేయ సైనికాధికారులు ఆమెను బంధించారు. ఆమె మీద రాజద్రోహం ముద్రవేశారు. ప్రథమ స్వా తంత్య్రసంగ్రామ యోధుల రహస్యాలు చెప్పమని ఆమెను వేధిం చారు. అధికారులతో సహకరించకుంటే సజీవదహనం చేస్తామని బెదిరించారు. ఆ బెదిరింపులు ఏవీ కూడా ఆమె పట్టుదలను సడలిం చలేకపోయాయి. చివరకు భయంకర చిత్రహింసల పాల్జేసినా ఆమె లొంగలేదు, పెదవి విప్పలేదు. అందుకు ఆగ్రహించిన అధికారులు ఆమెను సజీవదహనం చేయించారు. ఆంగ్లేయ సైనికాధికారుల హింసాత్మక చేష్టలను భరించిన అస్గరీ బేగం మాతృభూమి సేవలో చిరునవ్వుతో బలయ్యారు.

(Freedom Movement and Muslims, santi mony  Ray, PPH, New Delhi 1993, and who is who indian Martyrs, Dr. PN Chopra, govt of india public ations, New Delhi 1973)