ద్విచక్రవాహనం కారు ఢీ : ఒకరు మృతి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): కొత్తూరు మండలం నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహంతో స్థానికులు రోడ్డుపై భైఠాయించారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.