మహబూబ్‌నగర్‌ జిల్లాలో డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు

హైదరాబాద్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని 8 డిపోల్లో దాదాపు 800 ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెలంగాణ బంద్‌కు మద్దతుగా ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించడంతో పాటు తెలంగాణ వాదులు డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనలకు దిగారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడే బస్సులు నిలిచిపోయాయి.