మహబూబ్‌నగర్‌లో దారుణం భార్య, ఇద్దరి పిల్లల గొంతుకోసిన కసాయి భర్త

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా టీడీ గుట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త తన కట్టుకున్న భార్య ,కన్న పిల్లలని చూడకుండా ఘోరానికి ఒడిగట్టాడు. కుటుంబ కలహాలతో తన భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేశాడు.ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లీపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.భర్త పరిస్థితి విషమంగా ఉంది.ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. నిన్నటి వరకు తమ కళ్లముందే తిరిగిన చిన్నారులు విగతజీవులుగా మారడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.