పాలమూరులో హట్టహాసంగా ప్రారంభమైన బంగారు బతుకమ్మ సంబురాలు

మహబూబ్‌నగర్‌ : పాలమూరు జిల్లా కేంద్రంలో బంగారు బతుకమ్మ పండుగ సంబురాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంగిలి పూల బతుకమ్మ సంబురాలు పాలమూరు జిల్లాలో జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.పాలమూరు జిల్లాకు ఎంతో చరిత్ర ఉందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు.