జైలు నుంచి ఖైదీ పరారు. పట్టుకున్న పోలీసులు

మహబూబ్‌నగర్‌ : పోలీసుల కళ్లు గప్పి మహబూబ్‌నగర్‌లో ఓ ఖైదీ పరారాయ్యాడు. అయితే కొద్దిసేపట్లోనే ఆ ఖైదీని పోలీసులు పట్టుకున్నారు. ఓ హత్యకేసులో వెంకటయ్య అనె వ్యక్తి నిందితుడిగా ఉన్నాడు. మహబూబ్‌నగర్‌ ఫ్యామిలీ కోర్టు అతనికి జీవిత ఖైదు విధిస్తూ ఈ రోజు శిక్ష ఖరారు చేసింది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే వెంకటయ్య తప్పించుకుని పారిపోయాడు. జిల్లా పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి పిల్లలమర్రి దగ్గర వెంకటయ్యను పోలీసులు పట్టుకుని జైలుకు తరలించారు.