700 మందిని అదుపులోకి తీసుకున్నాం.

మహబూబ్‌నగర్‌ జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌
మహబూబ్‌నగర్‌: సడక్‌బంద్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ నాగేంద్రకుమార్‌ తెలిపారు. వీరిపై ఎటువంటి కేసులు నమోదు చేయలేదని సాయంత్రానికి వదిలేస్తామని పేర్కోన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా 13 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వాహనాల ధ్వంసం కేసులో నాలుగు కేసులు నమోదు చేశామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు , ఎమ్మెల్యేలు దాడుల్లో పాల్గొన్నట్లు విచారణలో తేలితే వారిపై క్రిమనల్‌ కేసులు నమోదు చేస్తామని తెలిపారు.