8 ఏళ్ల చిన్నారిపై యాసిడ్‌ దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): నారాయణపేటలోని బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల చిన్నారిపై 14 ఏళ్ల బాలుడు యాసిడ్‌తో దాడి చేశాడు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.