జపాన్‌ పర్యటన నుంచి ఢిల్లీకి మోడీ

4

ప్రధాని రాకతో స్టాక్‌మార్కెట్‌ ఉరకలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 3 (జనంసాక్షి) : భారత ప్రధాని నరేంద్ర మోడీ జపాన్‌ పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఢిల్లీకి తిరిగొచ్చారు. ఐదు రోజుల పర్యట ముగించుకుని బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన రాకతో స్టాక్‌మార్కెట్‌ ఉరకలెత్తింది. విమానాశ్రయంలో మోడీకి విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్‌ స్వాగతం పలికారు. ఐదు రోజులు జపాన్లో పర్యటించిన మోడీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌కు రెండు లక్షల కోట్ల రూపాయిల ఆర్థిక సాయం చేసేందుకు జపాన్‌ హావిూ ఇచ్చిన సంగతి తెలిసిందే. కీలక రంగాల్లో ఇరు దేశాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డాయి. మోడీ పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రధానితో జరిపిన పలు చర్చల్లో సానుకూలత వ్యక్తమైంది.

ఓ వైపు మోడీ సర్కార్‌ వందరోజుల పాలనకు చేరువవుతుంటే సెన్సెక్స్‌ జెట్‌ స్పీడుతో దూసుకుపోతోంది. ఐటీ, విూడియా, టెక్నాలజీ, ఆటో రంగాల కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు మరోసారి జీవితకాలపు గరిష్టస్థాయి వద్ద ముగిసాయి. భారత స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో  ప్రధాన సూచీల్లో నిఫ్టీ 8100పైన ముగియడం ఇదే తొలిసారి. బుధవారం నాటి ట్రేడింగ్‌ లో సెన్సెక్స్‌ 120 పాయింట్ల వృద్ధితో 27139 వద్ద, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8114 వద్ద ముగిసింది.  కోల్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, భారతీ ఎయిర్‌ టెల్‌, విప్రో, టీసీఎస్‌ కంపెనీలు సుమారు మూడు శాతం లాభపడగా, గెయిల్‌, ఓఎన్‌ జీసీ, ఐటీసీ, బజాజ్‌ ఆటో, భెల్‌ కంపెనీలు స్వల్ప నష్టాల్ని నమోదు చేసుకుంది. నరేంద్రమోడీ ప్రభుత్వ పాలన మొదలై 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా సెన్సెక్స్‌ చరిత్రలో తొలిసారి 27,000 పాయింట్లను అధిగమించింది. జీడీపీ జోష్‌, కరెంట్‌ ఖాతా లోటు కట్టడి, మోడీ సంస్కరణలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు… వెరసి వరుసగా 8వ రోజు సెన్సెక్స్‌ లాభాలు అందుకుంది. సెన్సెక్స్‌  ఇంట్రాడేలో గరిష్టంగా 27,083కు చేరి చివరికి 152 పాయింట్ల లాభంతో 27,019 వద్ద ముగిసింది.

ఇక నిఫ్టీ కూడా ఒక దశలో 8,102ను తాకింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి 55 పాయింట్ల లాభంతో 8,083 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, సెన్సెక్స్‌ 26,000 పాయింట్ల నుంచి 27,000కు చేరడానికి 40 ట్రేడింగ్‌ రోజులు తీసుకుంది. అంటే జూలై 7న 26,000ను తాకగా, సెప్టెంబర్‌ 2న 27,000ను దాటింది. ఈ ఏడాది తొలి క్వార్టర్‌(ఏప్రిల్‌-జూన్‌)లో రెండున్నరేళ్ల తరువాత జీడీపీ 5.7శాతం వృద్ధిని సాధించగా, కరెంట్‌ ఖాతా లోటు 4.8? నుంచి 1.7?కు పడిపోవడం సెంటిమెంట్‌కు ఊపునిచ్చిందని విశ్లేషకులు పేర్కొన్నారు. రానున్న ఐదేళ్లలో 34 బిలియన్‌ డాలర్లను ఇండియాలో ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు జపాన్‌ ప్రకటించడం మరింత బలాన్నిచ్చిందని నిపుణులు పేర్కొన్నారు. కాగా, మోడీ పాలనలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో సెన్సెక్స్‌ 9 శాతం పెరగడం గమనార్హం. సోమవారం రూ. 554 కోట్లను ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 673 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. కాగా, ఆస్తమా ఊపిరితిత్తుల వ్యాధుల చికిత్సకు వినియోగించే జనరిక్‌ ఔషధాన్ని జర్మనీ, స్వీడన్‌లలో విక్రయించేందుకు అనుమతి పొందిన  సిప్లా 5.2 శాతం ఎగసింది. మిగిలిన సెన్సెక్స్‌ దిగ్గజాలలో భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌

ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 4-2? మధ్య పుంజుకోగా, సెసాస్టెరిలైట్‌, టాటా పవర్‌, హిందాల్కో, విప్రో 2-1? మధ్య నష్టపోయాయి. ట్రేడైన షేర్లలో 1,738 లాభపడగా, 1,250 తిరోగమించాయి. తమ గ్రూప్‌ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులకు జపాన్‌ బ్యాంక్‌ ఇంటర్నేషనల్‌(జేబీఐసీ)తో అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్న జీఎంఆర్‌ షేరు 3.5 శాతం బలపడి రూ. 26.65 వద్ద ముగిసింది. రోజురోజుకీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తున్న మార్కెట్ల బాటలో పలు షేర్లు సైతం లాభాలతో పరుగుతీస్తున్నాయి. ఇప్పటికే పలు స్టాక్స్‌ ఏడాది గరిష్టాలను తాకగా, తాజాగా ఈ జాబితాలో 323 కంపెనీలు చేరాయి. వీటిలో ఏసీసీ, భారతీ ఎయిర్‌టెల్‌, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హీరో మోటోకార్ప్‌, లుపిన్‌, ఐవోసీ, ఎంఅండ్‌ఎం, మారుతీ, టెక్‌ మహీంద్రా వంటి దిగ్గజాలుండటం విశేషం!

తిరోగమనంలో బంగారం ధరలు

స్టాక్‌ మార్కెట్లు దుమ్మురేపుతుంటే మరోవైపు బంగారం ధర తిరోగమనంలో పయనిస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర 1268 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది 10 వారాల కనిష్ఠస్థాయి. ఎంసీక్‌స్లో బంగారం ధర 27,600కు పడింది. బంగారంలో పెట్టుబడి పెట్టడం కంటే స్టాక్‌ మార్కెట్లో మదుపు చేస్తే మంచి లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. దాంతో జూన్‌తో ముగిసిన తైమ్రాసికంలో బంగారంలో పెట్టుబడి 67 శాతం తగ్గిందని ప్రపంచ స్వర్ణ మండలి తెలిపింది. మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పరుగులు తీస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి సానుకూల వార్తలు వస్తుండటంతో డాలర్‌ బలపడుతోంది. ఈ ప్రభావం బంగారంపై ప్రతికూలంగా పడుతోంది. ఇరాక్‌, లిబియా, ఉక్రెయిన్‌లలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నప్పటికీ ప్రపంచం ఈ దేశాల ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉండదని మదుపుదారులు భావిస్తున్నారు. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి కారణమవుతోంది.