మరోసారి తన మానవత్వం చాటుకున్న సుతారి తిరుపతి టీం

 

రాయికల్ అక్టోబర్27 (జనం సాక్షి)

నిరుపేద యువకునికి చేయుత అందించిన యువ నేత….
రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన ముస్లిం యువకుడు ఇబ్రహీం ప్రమాదవశాత్తు బైక్ పై నుండి పడి తీవ్ర గాయలై ఓం సాయి హాస్పిటల్ లో అడ్మిట్ అవగా వారి ఆర్థిక పరిస్థితి చూసి చలించి కులమత భేదాలు లెకుండా యువతకు మార్గదర్శకులగా నిలిచి పిలువగానే అందరికీ అందుబాటులో వుండే యువ నాయకుడు సూతరి తిరుపతి రెడ్డి తన వంతు ఆర్థిక సహాయాన్ని ఐదువేల రూపాయలను వారి కుటుంబ సబ్యులకు అందజేసినారు, అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని అను నిత్యం అల్లిపూర్ గ్రామంలో ఎవరికి ఏలాంటి సమస్య వచ్చిన ముందంజలో ఉండి సహాయం చేస్తున్న సుతారి తిరుపతి కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టంపేట్ తాజా మాజీ సర్పంచ్ జాన స్వరూప గోపి, మరియు అల్లిపూర్ తాజా మాజీ వార్డు సభ్యులు లోకిని రాజేందర్,
TMM రాష్ట్ర కార్యదర్శి వేల్పుల ప్రవీణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.