ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేచింది… టీమిండియాపై టాస్ గెలిచిన ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు టెస్టుల సిరీస్కు తెరలేచింది. ఈ సిరీస్లో భాగంగా మొదటి టెస్ట్ మ్యాచ్ లీడ్స్లోని హెడింగ్లీ మైదానంలో నేడు ఆరంభమైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది.
యువ కెప్టెన్ గిల్ నాయకత్వంలో బరిలో దిగిన భారత్ ఈ సిరీస్ ను చేజిక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు, సొంతగడ్డపై బెన్ స్టోక్స్ సేనను తక్కువగా అంచనా వేయలేం. బజ్ బాల్ క్రికెట్ తో దూకుడుగా ఆడే ఇంగ్లాండ్ తమకు అనుకూలమైన పరిస్థితుల్లో చెలరేగిపోతుంది. దాంతో ఈ సుదీర్ఘ సిరీస్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.