నక్సలిజాన్ని తుదముటిస్తాం
` నిజామాబాద్కు పసుపులో ప్రపంచ కీర్తి
` నలభై ఏళ్ల పసుపు రైతుల కలను ప్రధాని మోదీ నెరవేర్చారు
` వారి సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉన్నాం
` తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం..
-పట్టు వీడని విక్రమార్కుడు ఎంపీ ధర్మపురి అర్వింద్
` నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలి
` నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు జాతీయ కార్యాలయం ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి అమిత్ షా
` కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు బాధ్యత మాది కాదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
నిజామాబాద్ జిల్లా బ్యూరో జూన్ 29 (జనంసాక్షి) :తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా పసుపు ప్రపంచ స్థాయిలో కీర్తి ఘడిరచిందని, తెలంగాణ రాష్ట్రంలోని పసుపు రైతుల 40 ఏళ్ల కలను నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెరవేర్చిందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం పసుపు బోర్డు కార్యాలయాన్ని అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీ అర్వింద్ తో పాటు రాష్ట్ర నేతలు ఎంతో పోరాటం చేశారని, ఎంపీ ధర్మపురి అర్వింద్ మాత్రం పట్టువీడని విక్రమార్కుడని గుర్తు చేశారు. ఇందూరు కేంద్రంగా పసుపు బోర్డు మంజూరు చేయడమే కాదు నిజామాబాద్కు చెందిన రైతు బిడ్డ పల్లె గంగారెడ్డి ఆ బోర్డుకు ఛైర్మన్ చేశామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి, ఇచ్చిన మాట ప్రకారం బోర్డును ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా ప్రపంచానికి నిజామాబాద్ పసుపు ఎగుమతి అవుతుందని, నిజామాబాద్ పసుపుకు రాజధానిలా మారాలని అమిత్ షా ఆకాంక్షించారు. మూడు నాలుగు సంవత్సరాల్లోనే నిజామాబాద్ పసుపు ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతుందని చెప్పారు. ఆర్గానిక్ పసుపు ఉత్పత్తితో పాటు మార్కెటింగ్కు కేంద్రం కృషి చేస్తోందన్నారు. ఒక బిలియన్ డాలర్ పసుపు ఎగుమతులే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని చెప్పారు. ప్రపంచంలో పసుపునకు డిమాండ్ ఉన్న దృష్ట్యా అందులో ఉండే ఔషధ గుణాలపై ప్రచారం నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ఎగుమతులకు కావాల్సిన చర్యలను తాము తీసుకుంటామన్నారు. పసుపు ప్రొడక్షన్, ప్యాకేజింగ్, ఎక్స్పోర్ట్స్ తదితర అంశాలపై పసుపు బోర్డు ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామన్నారు. ప్రపంచం అంతా నిజామాబాద్ పసుపు గుబాళిస్తుందన్నారు. భారత్ ఆర్గానిక్ కార్పొరేషన్, ఎక్స్పోర్ట్ కార్పొరేషన్లను కూడా ఇందూరులో ఏర్పాటు చేసి కొనుగోలు, రవాణా, ఎగుమతి పసుపు బోర్డు చూసుకుంటుందని షా వివరించారు.
నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలి
నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. నిజామబాద్లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో ఆయన ప్రసంగించారు. ‘’పహల్గాంలో ఉగ్రదాడితో పాకిస్థాన్ మనల్ని భయపెట్టాలని చూసింది. ఆ తర్వాత భారత్ శక్తి ఏమిటో పాకిస్థాన్కు, ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం కూడా లేకుండా చేయాలన్నదే మోదీ లక్ష్యం. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా? మీరే చెప్పండి. 2026 మార్చి 30 లోపు దేశంలో నక్సలిజం లేకుండా చేస్తాం. నక్సలైట్లు తక్షణమే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలి. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలి. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారు.. జన జీవన స్రవంతిలోకి వచ్చేశారు.
తెలంగాణలోనూ అధికారంలోకి వస్తాం..
తెలంగాణలో భాజపా తప్పక అధికారంలోకి వస్తుంది. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే భాజపా విజయం ఖాయమైందని తెలుస్తోందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్ నిజామాబాద్కు పసుపుబోర్డు సాధించారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని కూడా నిజామాబాద్లోనే ఏర్పాటు చేస్తున్నాం. మోదీ ఏదైనా చెప్పారంటే అది తప్పకుండా చేసి చూపిస్తారు. నిజామాబాద్ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారు. నిజామాబాద్ రైతులు పండిరచిన పసుపు భవిష్యత్లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుంది. పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. భారత్ ఆర్గానిక్ లిమిటెడ్, భారత్ ఎక్స్పోర్టు లిమిటెడ్ కూడా నిజామాబాద్లోనే ఏర్పాటవుతున్నాయి. భారత్ ఎక్స్పోర్టు లిమిటెడ్తో నిజామాబాద్ పసుపు అమెరికా, యూరప్కు ఎగుమతి అవుతుంది. భారాస సర్కార్ అవినీతికి పాల్పడిరదా? లేదా? ధరణి పోర్టల్, కాళేశ్వరం.. ఇలా అనేక అంశాల్లో భారాస ప్రభుత్వం అవినీతికి పాల్పడిరది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దిల్లీకి ఏటీఎంగా మార్చేసింది. తెలంగాణలో భారాస పోయింది.. కానీ, అవినీతి పోలేదు’’ అని అమిత్ షా అన్నారు. కేంద్రమంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ధర్మపురి అర్వింద్, లక్ష్మణ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు సభలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు బాధ్యత మాది కాదు: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన చేసిన ప్రధాని మోదీ, కేంద్ర హోమంత్రి అమిత్షాకు తెలంగాణ ప్రజలు, రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్షా ప్రారంభించిన విషయం తెలిసిందే. కిషన్రెడ్డి మాట్లాడుతూ.. నేషనల్ కో-ఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేస్తామని హోంశాఖ మంత్రి ప్రకటించినట్లు తెలిపారు. నేషనల్ కో-ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్కి సంబంధించిన బ్రాంచ్ ఆఫీస్ను కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతున్నట్లు అమిత్షా వెల్లడిరచారని చెప్పారు. ‘‘భాజపా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తోంది. ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు వాటిని అమలు చేయాలని భాజపాను అడుగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధత్య మాది కాదు. కేవలం భాజపా ఇచ్చిన హామీలను అమలు చేసే బాధ్యత మాత్రమే మాది. కాంగ్రెస్ హామీలను రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేయాలి. మోదీ తెలంగాణకు ఏం ఇచ్చారు?కిషన్రెడ్డి ఏం తెచ్చారనే విచిత్ర వాదన వినిపిస్తోంది. అధికారంలో కాంగ్రెస్ నేతలు ఉండి హమీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై వేయడం ఏంటి? ఇచ్చిన హామీలను కాంగ్రెస్ కచ్చితంగా అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నా’’అని కిషన్రెడ్డి అన్నారు.
రైతును రారాజు చేయాలనేది నరేంద్రమోదీ నినాదం: బండి
నరేంద్రమోదీ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. నిజామాబాద్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం స్థానిక పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో మరో కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రసంగించారు. ‘’పసుపు బోర్డు కోసం ఇందూరు రైతులు గల్లీ నుంచి దిల్లీ వరకు పోరాటం చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను దిల్లీలో పసుపు అర్వింద్ అంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్ షా ఆదేశాలతో నిజామాబాద్లో పసుపుబోర్డు ఏర్పాటు చేశారు. దీంతో పాటు జాతీయ పసుపు బోర్డు చైర్మన్గా నిజామాబాద్ వ్యక్తినే నియమించారు.రైతును రాజు చేయాలనేది గత నినాదం. రైతును రారాజు చేయాలనేది నరేంద్రమోదీ నినాదం. రైతులంతా మోదీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి.. అండగా ఉండాలి. తెలంగాణలో అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చారు. భాజపాకు ఒక్కసారి అవకాశమివ్వండి’’ అని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు.