` ఈ దేశం మనది.. దేశం కోసం చివరిరక్తపు బొట్టు, ప్రాణాత్యాగానికైనా సిద్ధం
` మన గంగా జమున తహజీబ్ ఎంతో విశిష్టమైనది..ప్రపంచానికే ఆదర్శం
` మైనార్టీల సంక్షేమం కోసం రూ.12వేల కోట్లు కేటాయించాం
` ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో కార్యక్రమంలో సీఎం కేసీఆర్
హైదరాబాద్(జనంసాక్షి): దేశం ప్రమాదంలో పడిరదని, దీనిని కాపాడేందుకు చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతానని సిఎం కెసిఆర్ అన్నారు. గంగా తెహజీబ్ అయిన దేశం పరంపరను కాపాడుకోవాల్సి ఉందన్నారు. ఎల్బీ స్డేడియంలో తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. ముస్లిం సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో సంక్షేమాలు చేపట్టిందని అన్నారు. గత 9 ఏళ్లలో ముస్లింల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం12 వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను పట్టించుకోలేదని, మైనార్టీల బాగోగులు చూసింది తామేనని చెప్పారు. తాము అన్ని వర్గాల విశ్వాసాలను కాపాడుతున్నామని సీఎం చెప్పారు. మన రాష్ట్ర ఆదాయం పెరిగిందన్న కేసీఆర్ .. తెలంగాణ దరిదాపుల్లో కూడా మరో రాష్ట్రం లేదని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణ ముందుందని చెప్పారు. దేశం కూడా మన రాష్ట్రం లాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని వెల్లడిరచారు.
ఈ దేశం మనందరిది.. చివరి రక్తపు బొట్టు వరకు దేశం కోసం పోరాడాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆవేశంతో కాదు.. ఆలోచనతో ఈ దేశాన్ని కాపాడుకుందాం. దేశాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా చివరకు న్యాయమే గెలుస్తుంది. గంగాజమునా తెహజీబ్ సంస్కృతి విశిష్టమైంది అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. 9 ఏండ్ల కిందట తెలంగాణ అంటే వెనుకబడిరది అనేవారు. ఇప్పుడు అభివృద్ధిలో మన దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా లేదు. తలసరి ఆదాయం తెలంగాణ నంబర్ వన్గా నిలిచింది. అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు పదేండ్లలో కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ. 1200 కోట్లు మాత్రమే. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మైనార్టీల కోసం గత 9 ఏండ్లలో రూ. 12 వేల కోట్లు ఖర్చు పెట్టాం అని తెలిపారు. మనం అభివృద్ధి చెందుతున్నంతగా మిగతా రాష్టాల్ల్రో అభివృద్ధి లేదు. తాగు, సాగు నీరు, కరెంట్ సమస్యలు పరిష్కరించుకున్నాం. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీకి ఘనస్వాగతం లభించింది. దేశం కూడా మనలాగే అభివృద్ధి చెందాలన్నదే తన లక్ష్యమని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఇఫ్తార్ విందులో మంత్రులు మహముద్ అలీ, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, సానియా విూర్జా, ముస్లిం మతపెద్దలతో పాటు 13 వేల మంది ముస్లింలు పాల్గొన్నారు. ముస్లిం చిన్నారులకు కేసీఆర్ రంజాన్ కానుకలు అందించారు. దీంతో ఆ పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మైనార్టీల గురుకుల విద్యార్థులకు సీఎం కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
యే దేశ్ హమారా.. జాన్ ఖూన్ కా ఖుర్బానీ దేంగే..
Other News
- ఉపాధి హామీ కూలి మృతికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. కుటుంబాన్ని సందర్శించిన సిపిఐ నాయకులు.
- జనభాగిదారి కార్యక్రమం లో పాల్గొన్న కే.వి ప్రిన్సిపల్ ఆర్.శంకర్
- ప్రతి ఒక్కరూ దైవచించిన తో పాటు సమాజ సేవలో కృషి చేయాలి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
- సీఎం కేసీఆర్ బహిరంగ సభను జయప్రదం చేయండిఅలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసే కార్యక్రమాలు ఆపాలి. కాంగ్రెస్ జిల్లా మహిళా అధ్యక్షురాలు నాగశిరో
- తెలంగాణ కోటి రతనాల మగనిగా మార్చిన ఘనత కేసీఆర్ దే అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం
- సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఆందోల్ సస్యశ్యామలం - మంత్రి హరీష్ రావు
- అలంపూర్ అభివృద్ధి పై బిఆర్ఎస్ నాయకులు చర్చకు సిద్ధమా? బిఎస్పీ జిల్లా అధ్యక్షులు కేశవరావు
- మత్స్య ఉత్పత్తుల ఆహార విక్రయ మేళా(ఫిష్ ఫెస్టివల్) ను జయప్రదం చేయండి.
- పేదోడి బతుకు కోరే ఏకైక పార్టీ సిపిఐ పార్టీ -- జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి