అసెంబ్లీ ఎదుట తెదేపా ఎమ్మెల్యేల రాస్తారోకో
హైదరాబాద్: కవాతుకు వస్తున్న తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెదేపా ఎంపీలు అసెంబ్లీ ముందు రాస్తారోకోకు దిగారు. అయితే ఇక్కడ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేలను అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్కు తరలించారు.



