ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వామిగౌడ్ విజయం
హైదరాబాద్: ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి స్వామిగౌడ్ విజయం సాధించారు. మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో స్వామిగౌడ్ 33 వేల ఓట్లు సాధించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విజయాన్ని తెలంగాణ ప్రజల విజయంగా అభివర్ణించారు.