కూడంకుళంలో కొనసాగుతున్న ఉద్రిక్తత
తమిళనాడు: కూడంకుళంలో అణు విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిషేదాజ్ఞలు ఉల్లంఘించి ఆందోళనలు కొనసాగిస్తున్నవారిని పోలీసులు చెదరగొట్టారు. ఆణు విద్యుత్ కేంద్రానికి 1.5 కి.మీ దూరంలో పోలీసులు ఆందోళనకారులను అడ్డుకొని టియర్గ్యాస్ను ప్రయోగించారు. మరోవైపు నిరసనకారులు దీక్షాస్థలం ఖాళీ చేసేందుకు ససేమిరా ఆనడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.



