గ్రూప్-1 మెయిన్స్ అవకాశం కోల్పోయిన అభ్యర్థులకు వూరట
హైదరాబాద్:గ్రూప్-1 కటాఫ్ మార్కుల పెంపు వల్ల మెయిన్స్ అర్హత కోల్పోయిన అభ్యర్థులకు శుభవార్త.కటాఫ్ మార్కులపై ఏపీపీఎస్సీకి ట్రైబ్యునల్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. కటాఫ్ మార్కుల పెంపు వల్ల మెయిన్స్ అర్హత కోల్పోయిన అభ్యర్థులను కూడా పరీక్ష రాసేందుకు అనుమతించాలంటూ ట్రైబ్యునల్ ఏపీపీఎస్సీని ఆదేశించింది.



