తెలంగాణకు ఇంకా తెల్లారనే లేదు..!

భారతదేశం మరో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న ది. ఆరు దశాబ్దాలుగా జరుపుకున్నట్టే ఈ ఏడాది కూడా దే శం యావత్తూ ఎంతో భక శ్రద్ధలతో జెండా వందనం చేసిం ది. పంద్రాగస్టు మనకొక పండగైపోవడానకి ప్రధాన కారణం మన దేశం వలనపాలన నుంచి విముక్తిపొందడం. మ నల్ని మనం పరిపాలించుకునే స్వేచ్ఛ, మన బతుకుల్ని మనం తీర్చి దిద్దుకోగలిగే అవకాశం, స్వాతం త్య్రానికి అర్థం నిర్వచనం కూడా అదే. ఏదైనా ఒక జాతి, దేశం, ప్రాదేశిక భూభాగానికి చెందిన ప్రజలు స్వపరిపాలనను, సార్వభౌమాధికారాన్ని కలి గి ఉండడమే స్వాతంత్య్రం. కానీ దేశంలో ఇంకా అధికభాగం ప్రజలు తమని తాము పరిపాలించుకుని తమ జీవితాలను మెరుగుపరచుకునే దశకు చేరుకోలేదు. ఈ అరవై నాలుగేళ్ల లో ఈ దేశంలోని అనేక జాతులు, తెగలు స్వాతంత్య్రం కో సం పరి తపిస్తూనే ఉన్నాయి.

దేశంలోని అనేక ప్రాంతాలు ఇంకా తాము వలసపాలన లో ఉన్నామనే భావిస్తున్నాయి. అదే రకమైన దోపిడీ, పీడన నుంచి విముక్తికోసం ఆరు దశాబ్దాలలో అనేక ఉద్యమాలు సా గాయి. కొన్ని విజయం సాధిస్తే, అనేకం అణచివేతకు గురైనా యి. అయినా ప్రజల్లో ఇంకా ఈ దేశంపై ప్రేమ చావలేదు. దేశ సార్వభౌమాధికారం పట్ల విశ్వాసం సడలలేదు. అందుకే స్వాతంత్య్ర దినమంటే ప్రజ ల్లో యెనలేని గౌరవం. ఇందుకు కారణం దేశం బాగుపడిందని తమ బతుకులు మారిపోయా యని కాదు. మన దేశానికి బహుశా ఈ పోరాటం లేకున్నా స్వాతంత్య్రం వచ్చేదే.

ఎందుకంటే రెండో ప్రపంచయుద్ధం తరువా త ఐరోపా సామ్రాజ్యవాదం కుప్పకూలి వలసవాద పాలన ప్రపంచవ్యా ప్తంగా అంతమయింది. బ్రిటన్‌ తనంతట తానుగా అన్ని దేశా ల నుంచీ విరమించుకుంది. నిజంగానే మన దేశాన్నుంచి వి రమించుకునేదో లేదో కానీ, స్వాతంత్య్ర కోసం సాగిన ఉద్య మం స్వపరిపాలన ఆత్మగౌరవాలకు ప్రతీక. దోపిడీ పాలన నుంచి భావితరాలను విముక్తి చేయడానికి వేలాది మంది చేసిన త్యాగాల ఫలితం కాబట్టే పంద్రాగస్టుకు ఆగౌరవం.

పంద్రాగస్టుకు తెలంగాణకు అసలు సంబంధమే లేదు. మనకు 1947లో స్వాతంత్య్రం రాకపోయినా జెండావందనం చేయడం ఒక జాతీయ భావ వ్యక్తీకరణే తప్ప మనకు ఈ రో జున జరిగింది, ఒరిగింది ఏమీ లేదు. మరీ విచిపూతంగా స్వాతంత్య్రం రావడంతో దేశమంతా వలసపాలన అంతరిస్తే తెలంగాణలో మాత్రం నయా వలనపాలనకు బీజం పడింది.

స్వాతంత్య్రం వచ్చిన ఏడాదికి భారత సైన్యాలు హైదరా బాద్‌ రాష్ట్రాన్ని ఆక్రమించుకుని, కలిపే సుకున్న ఎనిమిదేళ్లకే స్థానిక పరిపాలన అంతరిం చి ఆంధ్రా పాలన మొదలైంది. అప్పటిదాకా భూ మిపుత్రుల పాలనలో ఉన్న తెలంగాణ ప్రాం తం 1956 ఆంధ్రప్రదేశ్‌ అవతరణతో పరాయిపాలనలోకి వె ళ్లింది. తెలంగాణలో వలన పాలన అంతం కావాలని ఇక్కడి ప్రజలు నాటి నుంచి పోరాడుతూ నే ఉన్నారు. తెలంగాణ ప్ర జలు తమకు సంబం ధం లేకపోయినా జాతీయస్ఫూర్తితో జెం డా వందనం జరుపుకుని ఈ వ్యవస్థ మీద విశ్వాసం ప్రకట ిస్తే, ప్రజలకు జవాబుదారీగా లేని మంత్రులు ప్రజల ఆకాంక్ష లను తోసిరాజని అధికారిక కార్యక్రమా ల్లో పాల్గొని ‘వలస’ ప్రభుత్వాల సేవలో వునరంకితం అవుతున్నారు.

మన సంగతి అలా ఉంచుదాం. అసలు ఒక దేశంగా భా రతదేశం నిజంగానే స్వాతంత్య్రం పొందిందా ? ప్రజలకు స్వాతంత్య్రం వస్తే దోపిడీ పీడన ఇంకా ఎందుకు కొనసాగు తున్నాయి. ఇవన్నీ స మాధానాలు దొరకని ప్రశ్నలు. మనం స్వాతంత్య్రం సాధించుకోవడంలో సఫలీకృతులం అయినాం తప్ప, ఆ స్వాతంత్య్రాన్ని అందరికీ పంచడంలో ఘోరంగా వి ఫలమయినాం. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా వేరువేరు పద్ధ తుల్లో స్వాతంత్య్ర పోరాటాలు సాగుతున్నాయి. దోపిడీ, దౌర్జ న్యాలకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తూనే ఉన్నా రు. కొందరు తమ సంపదను అది అడవి కావచ్చు, భూమి కావచ్చు. ఆ భూమి కింది వనరులు కావచ్చు దోచుకుంటున్న శక్తులకు వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు సాగిస్తుంటే మరి కొందరు ప్రజల సంపదను కైంకర్యం చేసి కోట్లకు పడగలెత్తి న అవినీతిపరులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు.

ముఖ్యంగా ఈ దేశంలో నలుమూలలా విస్తరించిన ఆది వాసులు, పల్లెపల్లెనా వివక్షలో నలిగిపోతున్న దళితులూ, అభ ద్రతలో బతుకుతున్న ముస్లిం, ఆధిపత్యంలో ఊపిరాడని మ హిళలు ఇట్లా అ నేక జాతులు, తెగలు, వర్గాలు నిజమైన స్వే చ్ఛ కోసం, స్వాతంత్య్రం కోసం ప్రాణాలొడ్డి పోరాడుతూనే ఉ న్నారు. లాల్‌గఢ్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ దాకా విస్తరించి ఉన్న కొం డల్లో నివసిస్తోన్న ఆదివాసుల సం గతే చూడండి. పదేళ్ల నుం చి ఈ దేశ సంపదను దోచుకుపోతోన్న విదేశీ కంపెనీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈ పోరు స్వాతంత్య్ర పోరా టాన్ని తలపిస్తుంది. అప్పుడు కేవలం ఈస్ట్‌ ఇండియా కంపె నీ ఒక్కటే. కానీ ఇవాళ వందలాది కంపెనీ లు విస్తరించాయి. ప్రజలు ప్రాణత్యాగాలు చేసి పోరాడి తరిమేసిన విదేశీ పెట్టుబ డిదారీ శక్తులను మన ప్రభుత్వాలే సాగిలపడి ఆహ్వానించి వా ళ్ల అడుగులకు మడుగులొత్తుతున్నాయి. అట్లా దేశ సంపదను విదేశీ శక్తులకు తాకట్టు పెట్టడం తప్పని చెప్పిన వాళ్లను, ఎ దురు తిరిగిన వాళ్లను హింసావాదులని, దేశద్రోహులని కాసే పు అనుకుందాం. మరి గాంధీ మార్గంలో ఉద్యమాలు చేస్తు న్న వాళ్లను మాత్రం గౌరవిస్తున్నారా ? అవినీతికి వ్యతిరేకం గా గాంధీ మార్గంలో సత్యాగ్రహానికి పూ నుకున్న అన్నా హ జారేపై వ్యవహరిస్తోన్న పద్ధతి ప్రజాస్వామ్యానికే తలవంపు. తెలంగాణ విషయంలో పాలక వర్గాలు వ్యవహరిస్తోన్న పద్ధతి పార్లమెంటరీ వ్యవస్థకే అవమానం.

ఇంత జరగుతోంటే మన గౌరవ రాష్ట్రపతి ప్రతిభా పాటి ల్‌ ఏమంటున్నారో చూడండి. పార్లమెంటు ప్రతిష్ఠ కాపాడాల ని, తెలిసిగానీ అటువంటి రాజ్యాంగ వ్యవస్థల అధికారాలను, విశ్వసనీయతను దెబ్బతీయరాదని శ్రీమతి ప్రతిభా పాటిల్‌ ప్ర జలకు హితబోధ చేశారు. నిజానికి భారత రా జ్యాంగానికి రాష్ట్రపతి అధిపతి. అంటే ఈ దేశంలో పరిపాలన శాసనబ ద్ధంగా సాగుతున్నదీ లేనిది తెలుసుకోవాల్సిన వ్యక్తి అలా సాగే లా చూడవలసిన బాధ్యత వారిదే. అలాగే పార్లమెంటు నడిచే ది కూడా వారి కనుసన్నల్లోనే. మరి పార్లమెంటు విశ్వసనీయ తను దెబ్బతీస్తున్నదెవరో వారికి తెలికయకపోవడం విడ్డూరం. తెలంగాణపై పార్లమెంటులో స్పష్టమైన ప్రకటన చేసి ఇరవై నెలలు దాటింది. అయినా వలస చీకటి తొలగిపోలేదు.

ఈ స్వతంత్ర భారతదేశానికి ఎంత చరిత్ర ఉందో తెలం గాణ ప్రజల స్వపరిపాలన పోరాటాలకు అంతకంటే ఎక్కువ చరిత్రే ఉంది. స్వాతంత్య్రో ద్యమం ఎన్ని దశల్లో, ఎన్ని పాయ లుగా జరిగిందో అంతకంటే ఎక్కువ సందర్భాల్లోనే సాగింది. ఇంకా చెప్పాలంటే తెలంగాణ పోరాటంలో ఉన్నంత సృజనా త్మక చైతన్యం, వైవిధ్యం జాతీయోద్యమంలో కూడా కనిపించ దు. జాతీయోద్యమంలో ఎన్ని రోజులపాటు సత్యాగ్రహాలు జ రిగాయో తెలియదు గానీ తెలంగాణలో బోధన్‌ లాంటి చిన్న పట్టణాల్లో కూడా గడచిన ఆరువందల రోజులుగా ప్రజలు ని రవధిక దీక్షల్లో ఉన్నారు. ఆరువందల పైబడి సామాన్యులు పార్లమెంటు చేస్తోన్న మోసానికి నిరసనగా ఉరి కంబాలు ఎ క్కారు. జాతీయోద్యమం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందిగా నీ, తెలంగాణోద్యమం పల్లెపల్లెకూ విస్తరించింది. అలాంటి మహోద్యమం అహింసాయుతంగా అప్రతిహతంగా ఇంకా కొనసాగుతున్నదంటే ప్రజలు పార్లమెంటును గౌరవించబట్టే.

దాదాపు పది సంవత్సరాలపాటు ఆ పార్లమెంటుపై వి శ్వాసం ఉంచి అనేక పరీక్షలు, అవమానాలు ఎదురైనా భరిం చిన తెలంగాణ ప్రజలకు పార్లమెంటు ఇచ్చిన, ఇస్తోన్న భరో సా ఏమిటో రాష్ట్రప తిగారే చెప్పాలి. ఇప్పుడు భారత రాష్ట్రపతి గా వారు హితబోధ చేయాల్సింది. ప్రజలకు కాదు ఆ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్న తన పాలక పరివారానికి. నిజానికి ప్రభుత్వాలు వాటిని ఏలుతోన్న రాజకీయ పార్టీలే పార్లమెంటు మీద ఉన్న నమ్మకాలను వమ్ము చేస్తున్నాయి. ఏమాత్రం జవా బుదారీతనం లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నాయి. మాట మీద నిలబడాల్సిన ప్రభుత్వాలు రోజుకొక మాట చెప్పి ప్రజల ను మాయ చేస్తున్నాయి. వ్యక్తులుగా నీతి, నిజాయితీ లేని వా ళ్లు, అక్రమాలతో ప్రజలను దోచేసుకున్న వాళ్లు, గుత్తేదార్లు, బ్రోకరేజ్‌ చేసేవాళ్లు ఇవాళ శాసనకర్తలుగా అవతరించడం అ న్ని కంటే మించిన అమర్యాద అని గమనించడం మంచిది.

అలాంటి వారి వల్లనే ఇవాళ డబ్బులుంటే పార్లమెంటుకు వెళ్లొచ్చని, పార్లమెంటులో ప్రశ్నలు అడిగినా, అడగకపోయి నా డబ్బులు అందుతాయని, పార్లమెంటు తీసుకున్న నిర్ణయా లను ఆపవచ్చని తెలిసిపోయింది. గౌరవ పార్లమెంటు ఇప్పటి కే వివాదస్పదమయింది. ముందు రాష్ట్రపతిగా వారు ఒక అ డుగు ముందుకేసి ‘అతి సర్వత్ర వర్జయేత్‌’ అన్నారు. నిజమే అవినీతి అతి అయిపోయిందనే హజారే పార్లమెంటును నిలదీ సే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమాలు, దోపిడీలు, దొమ్మీలు చేసినవాళ్లు కోట్లకు కోట్లు ప్రజాధనాన్ని దోచిన వాళ్లు పార్ల మెంటు లోపల ఉ న్నారన్నది ఆయన వాదన.

వాళ్ల నుంచి విముక్తి కలిగినప్పుడే ఈ దేశానికి విముక్తి అని ఆయనతో పాటూ ఈ దేశ సౌభా గ్యం కోరుకుంటున్న వాళ్లు అందరూ భావిస్తున్నారు. దాన్ని ‘అతి’ అని కొట్టిపారే యడం ప్రజాస్వా మ్యాన్ని అవహేళన చేయడమే.