తెలంగాణలో కొత్త జిల్లాలు
– 24-25 జిల్లాలు
– 40కొత్త మండలాలు
– రాష్ట్ర ఆవిర్భావం నాడు ప్రకటించనున్న సర్కారు
– దసరా నుంచి ఏర్పాటు
– సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్,మే5(జనంసాక్షి): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కొత్త జిల్లాలపై ప్రకటన చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వెల్లడించారు. ఆగస్టు 15 నుంచి కానీ దసరా పండుగ నుంచి కానీ కొత్త జిల్లాల నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఉందన్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాలతో మొత్తం రాష్ట్రంలోని జిల్లాల సంఖ్య 24 నుంచి 25 వరకు చేరుతుందని సీఎం అన్నారు. వీటితో పాటు మరో 40 మండలాల ఏర్పాటు, ప్రస్తుతమున్న మండలాల పునర్వ్యవస్థీకరణ చేపడుతామన్నారు. కొత్త జిల్లాలు, కొత్త మండలాలకు సంబంధించిన కార్యాచరణ వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మను ముఖ్యమంత్రి ఆదేశించారు.నూతన రాష్టంగా ఆవిర్భవించిన తెలంగాణ ప్రగతి పథంలోకి దూసుకుపోతున్న నేపథ్యంలో జిల్లాలు కూడా చిన్నగా ఉంటే ప్రజలకు క్షేత్రస్తాయిలోకి సుపరిపాలన చేరుకుంటుందని తద్వారా బంగారు తెలంగాణ సాధ్యమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చారిత్రక ఘట్టంగా నిలిచిందని, జిల్లాలు మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలవనున్నదని సిఎం తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా అసెంబ్లీ నియోజక వర్గాల పెంపు జరగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే జిల్లాలను క్రమబద్దీకరించనున్నట్టు సిఎం తెలిపారు. ఎన్నికల హావిూకి అనుగుణంగా జిల్లాల క్రమబద్దీకరణ- పెంపు అనే అంశంపై అధికారిక నివాసంలో గురువారం సిఎం సవిూక్షా సమావేశం నిర్వహించారు.పరిపాలనా సౌలభ్యానికి వీలుగా అధికారుల సంఖ్యను పెంచాలని, ప్రతి ఎనిమిది నుంచి పది మండలాలకు ఒక రెవిన్యూ డివిజన్ అధికారిని నియమించాలని నిర్ణయించారు. జిల్లాల పునర్వవస్థీకరణ-కొత్త జిల్లాల ఏర్పాటుపై గురువారం క్యాంపు కార్యాలయంలో సీఎం సవిూక్ష సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్రెడ్డి, మిషన్ భగీరథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, పాపారావు, సీఎస్ రాజీవ్శర్మ, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్రావు తదితరులు ఇందులో పాల్గొన్నారు. జిల్లాలు చిన్న చిన్నగా ఉంటే సుపరిపాలన ప్రజలకు మరింత చేరువ అవుతుందని, కొత్త రాష్ట్రం ఏర్పాటు చారిత్రక ఘట్టంగా నిలిచినట్లే, జిల్లాలు మండలాల పెంపు మరో చారిత్రక ఘట్టంగా నిలుస్తుందని సీఎం అన్నారు.విభజన చట్ట ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగనున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగానే జిల్లాలను పెంచాల్సి ఉందన్నారు. జిల్లాలు పెరిగితే అదనపు నిధులు: కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో అందే గ్రాంట్లు, కేంద్రం నిధులతో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లాను యూనిట్గా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి మన రాష్ట్రం పూర్తి స్థాయి ప్రయోజనాలు పొందవచ్చని సీఎం అన్నారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల పెంపును శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయి పరిశీలనతో ప్రజా సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశించారు.తమ ప్రాంతాలు, తమ పట్టణాలు జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని, పాలనా పరమైన వెసులుబాటు దృష్ట్యా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీఎం అన్నారు. ఈ మేరకు ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. పెరుగనున్న ఉపాధి అవకాశాలు: జిల్లాల సంఖ్య పెరిగితే యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచనున్నట్లు సీఎం తెలిపారు.పూర్తి స్థాయి కసరత్తు తర్వాత ఎన్ని జిల్లాలుండాలి.. ఎన్ని మండలాలు పెంచాలనే స్పష్టత వస్తుందన్నారు. పెరిగిన జిల్లాలకు అనుగుణంగా కలెక్టర్, ఎస్పీ అధికార కార్యాలయాల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన కార్యాలయాలన్నీ కలెక్టరేట్లో ఉండాలని, విశాలమైన గదులు, కాన్ఫరెన్స్, విూటింగ్ హాల్ ఉండేలా నిర్మాణాలుండాలని అన్నారు. వీటికి సంబంధించి ఆర్కిటెక్ట్లతో నమూనాలు తయారు చేయాలని సీఎం చెప్పారు. ప్రతీ 8 నుంచి 10 మండలాలకు ఒక రెవిన్యూ డివిజన్ అధికారిని ప్రభుత్వం నియమించనున్నది. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను తక్షణమే రూపొందించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు.ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యుటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మిషన్ భగీరథ ఉపాధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు డి. శ్రీనివాస్, పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, సిఎంవో అధికారులు భూపాల్ రెడ్డి, శాంతి కుమారి, స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్, ఇంటిలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి, సీఎం రాజకీయ కార్యదర్శి శేరీ సుభాష్ రెడ్డి తదితరులు ఈ అత్యున్నత స్థాయి సవిూక్షా సమావేశంలో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య పెంపువల్ల కలిగే పరిపాలనా సౌలభ్యం తదితర ప్రజా ప్రయోజనాలను లోతుగా చర్చించారు. కేంద్రం నుంచి వివిధ పథకాల రూపంలో అందే గ్రాంటులు నెలకొల్పే విద్యాలయాలు కేంద్రం విడుదల చేసే నిధులు చేపట్టే అభివృద్ది కార్యక్రమాలు జిల్లాను యూనిట్ గా తీసుకునే నిర్ణయాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో జిల్లాల సంఖ్య ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి అందే ప్రయోజనాలను తెలంగాణ రాష్ట్రం పూర్తిస్తాయిలో పొందవచ్చని సిఎం తెలిపారు.ఆయా జిల్లాల్లోని ప్రాంతాలు జిల్లా కేంద్రాలకు వందల కిలో విూటర్ల దూరంలో వున్న విషయాన్ని సిఎం పరిశీలించారు. రెవిన్యూ, న్యాయ, మున్సిపల్, విద్యా, వైద్యం తదితర నిత్యం ప్రజలతో సంబంధాలుండే ముఖ్య కార్యాలయాలన్నీ జిల్లా కేంద్రాల్లోనే కేంద్రీకృతం అయి వుండడం మూలాన మారుమూల ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలుగుతుండడాన్ని సమావేశం విశ్లేషించింది. తెలంగాణ రాజధానిగా హైదరాబాద్ నగరం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రీకృతం అవుతున్న అభివృద్ధిని తెలంగాణ వ్యాపితంగా వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉన్నదని సిఎం తెలిపారు. హైదరాబాద్ కు దగ్గరలో ఉండి ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న పలు జిల్లాలకు చెందిన పట్టణాలను జిల్లా కేంద్రాలుగా తీర్చిదిద్దడం ద్వారా వికేంద్రీకరణ సాధ్యపడుతుందని సిఎం తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికంటే తక్కువ విస్తీర్ణం అతి తక్కువ జనాభా కలిగిన పలు రాష్ట్రాల్లో తెలంగాణ కంటే ఎక్కువ సంఖ్యలో జిల్లాలున్న సంగతిని సమావేశం పరిశీలించింది. న్యాయపరమైన, ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలు ప్రజలకు చేరువలో ఉన్నప్పుడే అధికారులు అందుబాటులో వుంటారని సిఎం స్పష్టం చేశారు. ప్రజా ప్రయోజనాలే ధ్యేయంగా జిల్లాల పెంపును శాస్త్రీయ పద్దతిలో చేపట్టాలని అధికారులకు సిఎం సూచించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాల కసరత్తు చేయాలని క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ప్రజలే కేంద్రంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నూతన జిల్లాల ఏర్పాటు జరగాలని అధికారులను సిఎం అదేశించారు.తమ తమ పట్టణాలు ప్రాంతాలు జిల్లా కేంద్రాలుగా ఉండాలని ప్రజలు కోరుకుంటారని అయితే పరిపాలనా పరమయిన వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రజలను సమాయత్తం చేయాలన్నారు. జిల్లాలు పెరిగితే యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయన్నారు. నియోజకవర్గాల పెంపు అంశం ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నందున అందుకు అనుగుణంగా ప్రభుత్వం జిల్లాల సంఖ్యను పెంచనున్నట్లు సిఎం తెలిపారు. ఎన్ని జిల్లాలు ఉండాలి.. ఎన్ని మండలాలను నూతనంగా ఏర్పాటు చేయాల్సి వుంటుంది? ప్రస్తుతం ఉన్న జిల్లాల్లో నూతనంగా ఏర్పాటు కానున్న జిల్లాలు ఏవి అనే అంశాలను పూర్తి స్థాయి కసరత్తు తర్వాత పరిశీలించనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా పెరిగిన జిల్లాలకు అనుగుణంగా కలెక్టర్, ఎస్సీ అధికార కార్యాలయాల నిర్మాణం చేపట్టాలని సిఎం సూచించారు. ప్రజలకు రోజూ అందుబాటులో ఉండాల్సిన రెవిన్యూ తదితర విభాగాలకు చెందిన అధికార యంత్రాంగం అంతా కలెక్టరు కార్యాలయంలో కేంద్రీకృతం అయితే బాగుంటుందని తెలిపారు. విశాలమైన గదులు, కాన్పరెన్స్ విూటింగ్ హాల్సు, నిర్మాణాలుండాలని అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్ట్ లతో నమూనాలను తయారుచేయించాలని సిఎం చెప్పారు.