తెలంగాణాపై స్పష్టమైన ప్రకటన చేయండి:కిషన్రెడ్డి
హైదరాబాద్: తెలంగాణా ఆంకాక్షాను ఈ ప్రాంత ప్రజలు మరోసారి తెలంగాణ మార్చ్తో విజయవంతం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి స్పష్టం చేశారు. సకల జనుల సమ్మె కేసులో భాగంగా ఆయన విచారణ నిమిత్తం నాంపల్లి కోర్టులో హజరయ్యారు. ఐప్పటికైనా యూపీఏ ఛైర్పర్సస్ సోనియా గాంధీ మౌనం వీడి తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ వ్యక్తం చేశారు. తక్షణమే విద్యార్థులపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ వ్యక్తం చేశారు.



