తెలంగాణ అలాయ్‌ బలాయ్‌ 26th

పార్లమెంటులో పూర్తి మెజారిటీ రాకపోవడం వలనా, ప్రతిపక్షాన్నిధ్వంసం చేసేంత బలం ఇంకా సమకూరనందునా,ఎన్నికలు జరపకుండా పాలన సాగించే పరిస్థితులు ఇంకా ఏర్పరిచే స్థితి లేనందు వల్ల ఆధిపత్య కులాల అండ పోతుందని సంఘ్‌ప రివార్‌ జంకుతున్నదిగానీ మందుమందు దాని ద ళితఅనుకూలధోరణిపెరిగితీరుతుంది. అంటే ఆది óపత్యకులాలవారికి దళిత అనుకూలత వచిచపడు తుందని కాదు. సంఘ్‌పరివర్‌కి ఆధిపత్య కులాల తోనూ అప్పుడు చిక్కులు రాకతప్పదు. దానితో పాటే ముస్లింల మీద అత్యాచారాలూ వాళ్లని దేశం నించి వెళ్లగోట్టే ప్రయత్నాలూ ముదిరి పోతాయి. అంటే దళితులకి పూర్తిస్తాయి హిందువులాగా మా రే అవకాశమఙబూ ముస్లింలకీ క్రైస్తవుల్లో కొంత మందికీ దేశం విడిచి పోవాల్సిన అగత్యమూ కలు గుతాయి. అప్పుడు దళిత జ్రానీకమూ వారి నాయ కత్వమూ ఏమి ఎంచుకుంటారో ఊహించడానికి పెద్ధగా తెలివితేటలు అక్కరలేదు. ఇప్పటి వారి రాజకీయ ప్రవర్తన చూస్తే చాలు, సులువుగానే గ్రహించవచ్చు. ఇలాంటి దుర్మార్గ విధానాలు సా ధ్యమాఅనిఎవరైనావిస్తుపోవచ్చు. అవును,సాధ్యమే ఇదవయ్యో వతాబ్ది చరిత్రలో ఇలాంటివి ఎన్నోసా ర్లుఎన్నోచోట్లజరిగాయి.ఇప్పుడూ జరుగుతున్నాయి ఇలాంటివి జరగవనే ధీమా ప్రజలకి ఉన్నచోటనే అవి జరిగాయి. అలాంటి ఊహాతీత మానవ విషా దాలుజరగాలంటేఅలాంటివిసాధ్యం కావనే ధీమా ప్రజలలో, ముఖ్యంగా బాధితులోaల్ల ఉండటం అవసరం. ఇప్పుడు దళిత నాయకత్వం ఎంచుకో వాల్సినదేమంటే ముస్లింలనీ క్రైస్తవులలో ఇక గాత న్ని సంఘ్‌పరివార్‌ దయాదాక్షిణాయలకి వదిలేసి, సంఘ్‌పరివార్‌ ఆశయాలు అందిస్తున్న అవకాశా లని అందిపుచ్చుకోవడమా లేదా అన్నదే. కాన్సా రాం, మహారాష్ట్రలోని కోంతమంది దళితూలూ తమ మార్గమేమిటో ఇప్పటికే స్పష్టం చేశారు. ఎటోచ్చీ ఆంద్రదేశంలోని దళితమేధావులే తమ వైఖరిని చెప్పకుండా దాట వేస్తున్నారు. శివసాగర్‌, కత్తి పద్మారావు, సతీష్‌చందర్‌, బోజ్జాతారకం, కలే కూరి ప్రసాద్‌, ఘంటా చక్రపాఫి లాంటివారు ఏమంటారో చూడాలి. హహుశా కల్యాణరావూ, గద్దర్‌, గోరటి వెంకన్నా మార్కిస్టులు కాబట్టి సం ఘ్‌పరివార్‌ దళితపార్టీల పోత్తుని ప్రమాదకరమనీ అవకాశవాదమనీ అనవచ్చు వారి సంగతి కూడా చూద్దాం.దళితుల మీద దాడులు జరిగినప్పుడు విప్లవపార్టీలు కలుగజేసుకోని దోషులని చంపిన సంధర్భాలుఉన్నాయి. ముస్లింమీద జరిగినప్పుడు మాత్రం ఈ విప్లవ పార్టీలు ఎందుకు పట్టించుకో వో అర్థం కాదు. ధళితులు హిందువులు కాబట్టేనా అని అడిగితే అసభ్యతలా కనిపిస్తుంది గానీ అది న్యాయమైన ప్రశ్నే ఎక్కడ ఎప్పుడు దాడులు జరిగి నా బాధితులకి ఆయుధాలివ్వాలని డిమాండ్‌ చేసే రాడికల్‌ మేధావులూ కార&య్రకర్తలూ ముస్లింల మీదాక్రైస్తవులమీదా దాడులు జరిగినప్పుడు శాంతి పావురాలేందుకయి పోతారో అంతుపట్టదు. రిజ ర్వేషన్లు సరిగ్గా కొన్ని చోట్ల అమలుకావడం లేదని ఎత్తిచూపేవారెవ్వరికీ ముస్లింలకి అసలు రిజర్వేష న్లే లేవనేవిషయం ఎందుకోగానీ పట్టదు. ఎన్‌కౌం టర్ల అక్రమాన్ని బయటపెట్టే పౌరహక్కుల సంఘా లకి ఐఎస్‌ఐ ఏంజెంట్లనీ తీవ్రవాదులతో సంబం దాలుఉన్నాయని చెప్పి ఎంతమంది ముస్లిం యువ కులని ఎత్తుకుపోయి మాయం చేసినా చిత్రహిం సలు పెడుతున్నా చంపి పడేస్తున్నా చీమైనా కుట్ట దు.ఇటితలికాలం వరకూ అగ్రవర్ణ మార్కి జమని పిలుస్తూ వచ్చినదానిని హిందూ మార్కిజమని గుర్తించాలని యాకూబ్‌ ఇచ్చిన పిలుపుని ఎవరూ పట్టించుకున్న దాఖలాగానీ ఖండించినట్టు గానీ ఎ క్కడా కనిపించలేదు. బోట్టులో కనిపించని మతం, జాకెట్టులో కనిపించని అణిచివేత మన కవులకి బురఖాలో మాత్రమే కనిపించడం పక్షపాతమని ఎవరూ అనరు. సంఘ్‌పరివార్‌ని అత్యంత నిలక డగా ప్రతిఘటించే మార్కిస్టులలోనే ఇంత హిందూ త్వం ఉందంటే ఏమీ అనుమానం రాకుండా బతి కెయ్యాలనుకోవడం ముస్లింలు ప్రదర్శిస్తున్న ఉష్ట్ర పక్షి ధోరణి తప్పర మరేంకాదు. మత సామరస యం కోసం గణేష్‌ ఉత్సవాల్లో పాల్గోనే ముస్లింలు మరిహిందూ శాంతివాదులెవ్వరూ నమాజు చెయ్య డానికి ఎందుకురారని ఆలోచిస్తే బావుంటుంది. ఒకముస్లింకవి మీద పోటా పెట్టమని కోరిన సెక్యు లార్‌ జర్నలిస్టు రమణమూర్తి మరి ఆరెస్సెస్‌ సాహి త్యకారుల మీదా ముదిగోండ శివప్రసాద్‌ లాంటి వాళ్ల మీదా ఎందుకలాంటి దాడి చెయ్యలేకపోయా రు? కుల, జెండర్‌, వర్గ, ప్రాంతాయ దోపిడిల మీదవచ్చినకోల్లలకోద్దీ కేరికేచర్‌ కథల మీద ఆయ నికి రానిక కోపం హిందూ ముస్లిం సంబందాల మీదముస్లింరచయితరాసినప్పుడే ఎందుకు రావల సివచ్చింది? స్త్రీలు మాత్రమ దళితులు మాత్రమే రాసిన సాహిత్యం అంటూ ప్రత్యేక సంకలనాలని అభినందించి చప్పట్లు చరిచిన ప్రగతిశీల సాహి త్యలోకం గుజరాత్‌ గురించి ముస్లింల రచనలతో ప్రత్యేక సంకలనం తెస్తే ఎందుకు పట్టించుకో లేదు? నాణ్యతకీ నవ్యతకీ పేరెన్నికగన్న ఒక ప్రతి ష్టాత్మకమైన ప్రచురణ సంస్థ ఆ పుస్తక ప్రచురణని మధ్యలో ఎందుకు ఆపేసింది? హింసకు ఎవకి ఎవరు పాల్పడినా తప్పేనంటే ఒప్పుకోని పౌరహ క్కులవారూ కులానిదేముంది పేదలందరి కష్టాలూ ఒక్కటేనంటే విరుచుకుపడే దళితవాదులూ దండి గానే హాజరైన గుజరాత్‌ గయం సభలో కొందరు సాహిత్యకారుల మీద వెకితిరాతల కరపత్రం రావ డాన్ని గుజరాత్‌ ముస్లిం స్త్రీలమీద జరిగిన అమా నుషత్వాన్నీ సమానమైనవని వాదించి గుజరాత్‌ బాధితుల అనుభవాన్ని అవమానించిన వారిని ఎవరూ పల్లెత్తుమాటేందుకు అనలేకపోయారు? మతోన్మాదులు కానివారూ నాస్తికులూ మార్కిస్టు లూ సైతం ఇంత ముస్లిం వ్యతిరేకతని మనసులో పెట్టుకన్నప్పుడు దాచుకోవాలనే మొహమాటమైనా కనబరచనప్పుడు ముస్లిం సమాజం, నాయకూలూ ,మేదావులూ కనబరుస్తున్న ఆశాభావం చూస్తుంటే నిరాశ కలుగుతుంది. వారు ఏదో సామూహిక ఆత్మహత్య వాంఛతో బాధపడుతున్నట్టుగా భయం కలుగుతుంది. అంటే దీనర్థం వ్యతిరేక భావాలు సరాసరిగా హత్యాకాండలకి దారితీస్తాయని కాదు. ద్వేష బావాల వలన మూకుమ్మడి హత్యకాండలు జరిగిపొవు. వాటిని జరపడానికి నిర్మాణాలూ సంఘాలూ వారిక అడ్డుచెప్పకుండా తప్పుకునే మెజారిటీ జనమూ వారికి ప్రతిఘటన లేకుండా బలయి. పోయే బాధితులూ కావాలి. వీటిలో దేని నీ ప్రగతిశీలవాదులూ మార్కిస్టులు సమకూర్చారు. వీలయినంత వరకూ అడ్డుపడటానికే నిస్సందేహం గా ప్రయత్నిస్తారు. కాకపోతేప్రమాదస్థాయిని బాధి తులు కాబోయేవాళ్లు గుర్తించకుండా ఉండటానికి ప్రగతిశీలవాదుల ధోరణులు కారణమవుతాయి. ఓ పక్క లక్షల కొద్దీ త్రిశూలాలు పంపిణీ అవుతుం టే,వాటినివాడటానికి పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తుంటే మన సెక్యులర్‌ వాదుల సంఘ్‌పరివార్‌ని ద్వేష ప్రచారంచేస్తున్నాదనివిమర్శిస్తారు.మంత్రులు వీధు ల్లోకి వచిచ జాతిమేధం జరిపించిన గుజరాత్‌లో ముఖ్యమంత్రే హత్యాకాండని ప్లాను చేశాడాని మా జి బీజేపి మంత్రే ప్రకటించిన తర్వాత కూడా వీరు గుజరాత్‌ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని అంటారు. బౌతిక నిర్మూలనకి ఏర్పాట్లన్నీ చేస్తుంటే వీరు ప్రజలని విడదీస్తున్నారని ఆరోపిస్తుంటారు. బాధితులుసరైనఆత్మరక్షణఏర్పాట్లు చేసుకోకుండా నివారించడం, తప్పుడు భద్రతా భావాన్ని సృష్టించ డం లౌకికవాదులు ముస్లింలకి క్రైస్తవులకి చేస్తున్న ప్రత్యక్ష అపకారం. వీరు బోదించే శాంతి ప్రవచా నాలని సంఘ్‌పరివార్‌ ఎలాగూ వినదు. బాధితు లనినిదాయుధంచేయడమే వీరి శాంతి ప్రబోదాలు సాధించే దల్లా. మరో మాట స్పూరించకా కోంత ఇప్పటికే ఈ మాట చెలామణిలో ఉన్నది కాబట్టీ మైనారిటీ స్పృహ అనే మాట వాడుతున్నాను కానీ నిజానికి ఈ మాట తప్పుదోవ పట్టిస్తుంది. భారత దేశంలో ఏ ఎత్నిక్‌ బృందమూ మెజారిటీ కాదు. అందరూ మైనారిటీలమనే అపోహ అనే మాట మైనారిటీస్పృహఅనేమాటకన్నసరైనది. తాము అభ ధ్రతా బావం అనే మాట గురించి కోంచెం చెప్పు కోవాలి. స్త్రీలకీ రక్షణ లేదనీ దళితులకి రక్షణ లేదనీ ఆఖరికి ప్రజా ప్రతినిధులకి రక్షణ వయిం దనీ మాట్లాడేవారందరూ ముస్లింల పరిస్థీతి గురిం చి మాత్రం అభద్రతా బావానికి గురవుతున్నారని అంటారు. అంటే ముస్లింల వరకూ వస్తే అభద్రత భావమై పోతుంది. సమస్య ముస్లింల మనస్సు ల్లోనే ఉందనే అర్థం సులువుగా వచ్చేస్తుంది. నిజా నికి రాజ్యమే ముస్లింలని చంపడం మొదలుపెడితే అడ్డుకోవడానికి ఐక్యరాజ్యసమితి గానీ అమెరికా గానీముందుకువస్తాయా,ముస్లింలనిచంపే పార్టీలు అధికారంలోకి రాకుండా తిరుగులేని గ్యారంటీ ఏ దైనామనరాజకీయవ్యవస్థలోఉందా? అనే ప్రశ్నలు ముందు ముస్లిం మేధావులు వేసుకుని సంతృప్తికర మైన సమాధానం వెతక్కుంటే మంచిది.
-వేముల ఎల్లయ్య,స్కైబాబ
ఇంకావుంది…