జగన్నాథ యాత్రలో అపశృతి
` తొక్కిసలాటలో ముగ్గురి మృతి.. 50 మందికిపైగా గాయాలు
` దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ..
` కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు
పూరీ(జనంసాక్షి):ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా..50 మందికి పైగా గాయపడ్డారు. మృతులను ప్రేమకాంత మొహంతి (80), బసంతి సాహూ (36), ప్రభాతి దాస్ (42)గా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.పూరీ జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ వెల్లడిరచిన వివరాల ప్రకారం.. రథయాత్ర ముగిసిన తర్వాత శనివారం జగన్నాథ ఆలయం నుంచి రథాలు శారద బలి వద్దకు చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి భక్తులు గుండిచా ఆలయం వద్దకు భారీగా చేరుకున్నారు. దర్శనం కోసం అందరూ ఒక్కసారిగా ముందుకు రావడంతో తొక్కిసలాట నెలకొంది. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించాయి. ఈ ఘటనపై ఒడిశా మంత్రి పృథ్వీరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.పూరీ రథయాత్రకు శనివారం భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అధిక జనసమూహం, అలసట కారణంగా దాదాపు 750 మంది భక్తులు అస్వస్థతకు గురవ్వడంతో అధికారులు వారిని ఆస్పత్రికి తరలించారు. వారిలో చాలామందిని ప్రథమ చికిత్స తర్వాత డిశ్చార్జ్ చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురైన 12 మంది భక్తులు కటక్లోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
దర్యాప్తునకు ఉన్నత స్థాయి కమిటీ..
ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ స్పందించారు. ప్రభుత్వం తరఫున క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట చోటుచేసుకుందని భక్తులు ఆరోపించారు. అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కలెక్టర్, ఎస్పీలపై బదిలీ వేటు
ఒడిశాలోని పూరీ జగన్నాథ రథయాత్రలో గుండిచా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందగా.. 50 మందికి పైగా గాయపడిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఒడిశా ప్రభుత్వం జిల్లా కలెక్టర్ సిద్ధార్థ శంకర్ స్వైన్ పూరీ పోలీస్ సూపరింటెండెంట్ వినిత్ అగర్వాల్లను బదిలీ చేస్తూ..ఉత్తర్వులు జారీ చేసింది. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. ఖుర్దా కలెక్టర్ చంచల్ రాణా నూతన జిల్లా మేజిస్ట్రేట్గా బాధ్యతలు స్వీకరిస్తారని.. ప్రస్తుతం ఏడీజీ (క్రైమ్)గా ఉన్న సీనియర్ పోలీసు అధికారి పినాక్ మిశ్రా ఎస్పీగా విధుల్లో చేరతారని తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రథాలపై ఉన్న దేవతలను చూడటానికి గుండిచా ఆలయం వద్దకు భక్తులు భారీగా చేరుకోవడంతో తొక్కిసలాట నెలకొంది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా..పలువురు గాయపడ్డారు. అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే తొక్కిసలాట నెలకొందని భక్తులు ఆరోపించారు. రద్దీకి అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయలేదని..అంబులెన్సులు కూడా అందుబాటులో ఉంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలమంది భక్తులు రథయాత్రకు వస్తారని తెలిసినా అధికారులు సరైన ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్ చరణ్ స్పందించారు. ప్రభుత్వం తరఫున క్షమాపణలు భక్తులను క్షమాపణలు కోరారు. భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. రథయాత్ర ముగిసే వరకు ఎటువంటి అసాధారణ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.