పన్ను మినహాయింపుతో ఖతార్‌లో భారతీయుడికి లాటరీ

దుబాయి: ఖతర్‌లో నివసిస్తున్న భారతీయుడిని అదృష్టం వరించింది. పన్ను మినహాయింపుతోకూడిన రూ.50 లక్షల నగదు బహుమతి సతీషబాబు కొన్న లాటరీ టికెట్‌ను వరించింది. కేరళకు చెందిన సతీషబాబు ఇక్కడి ఖతార్‌ ఎమిరి ఎయిరన్‌పోర్ట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నారు. ఏప్రిల్‌లో దోహ నుంచి తిరువనంతపురం వెళ్లే విమానం ఎక్కేముందు సతీషబాబు ఖతార్‌ ఎయిర్‌వేన్‌కు చెందిన క్యూడీఎఫ్‌ లాటరీ టికెట్‌ కొన్నార. ఏటా తాను వార్షక సెలవులకు భారత్‌ వెళ్లేప్పుడు ఈ లాటరీ టికెట్‌ కొనేవాడినని సతీషబాబు తెలిపారు.