పశ్చిమలో 11.9 మి.మీ సగటు వర్షపాతం నమోదు

ఏలూరు, ఆగస్టు 1 : పశ్చిమ గోదావరి జిల్లాలో గడిచిన 24గంటల్లో 11.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లుగా జిల్లా ప్రణాళికా శాఖ జాయింట్‌ డైరెక్టరు శ్రీ కె.సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యధికంగా నరసాపురం మండలంలో 30 మిల్లీమీటర్లు, అత్యల్పంగా ఉండ్రాజవరం మండలంలో 2.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదయింది. కాగా జీలుగుమిల్లిలో 14.4 బుట్టయిగూడెంలో 9.4, పోలవరంలో 4.8 తాళ్లపూడిలో 10.6, గోపాలపురంలో 11.4, కొయ్యలగూడెంలో 9.2, జంగారెడ్డి గూడెంలో 9.4, టి.నర్సాపురంలో 18.6, చింతలపూడిలో 15.8, లింగపాలెంలో 17.2, కామవరపుకోటలో 10.2, ద్వారకా తిరుమలలో 8.4, నల్లజర్లలో 8.2, దేవరపల్లిలో 4.2, చాగల్లులో 3.4, కొవ్వూరులో 2.8, నిడదవోలులోల 4.8, తాడేపల్లి గూడెంలో 5, ఉంగుటూరులో 6.8, భీమఢోలులో 10.8, పెదవేగిలో 12.4, పెదపాడులో 24.6, ఏలూరులో 22.6, దెందులూరులో 17.4, నిడమర్రులో 11.2, గణపవరంలో 15, పెంటపాడులో 5, తణుకులో 4.2, పెరవలిలో 4.6, ఇరగవరంలో 9.4, అత్తిలిలో 10.8, ఉండిలో 8.6, ఆకివీడులో 9.2, కాళ్లలో 19.4, భీమవరంలో 21.2, పాలకోడేరు 22, వీరవాసరంలో 13.4, పెనుమంట్రలో 16.8, పెనుగొండలో 9.1, ఆచంటలో 10, పోడూరులో 15.4, పాలకొల్లులో 11.2, యలమంచిలిలో 10.2, మొగల్తూరు మండలంలో 29.2 మిల్లీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదయింది.