పాకిస్థాన్ విజయం
కొలంబొ: ఆస్ట్రేలియా, పాకిస్థాన్ల మధ్య జరిగిన టీ 20 ప్రపంచకప్ మ్యాచ్లో పాకిస్థాన్ విజయం సాధించింది. పాకిస్థాన్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేరు కోవడంలో ఆస్ట్రేలియా విషలమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 117 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్లో హసీ ఒక్కడే అత్యధిక పరుగులు చేయగలిగాడు. ఆ తర్విత బెయిలీ 15 మిగిలిన వారంత అంతకన్నా తక్కువ పరుగులకే అవుటయ్యారు. పాకిస్థాన్ బౌలర్లలో అజ్మల్ మూడు వికెట్లు తీయగా, హసన్, హఫీజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.



