మార్చ్‌తో తెలంగాణ రగిలింది: మధుయాస్కీ

న్యూఢిల్లీ: తెలంగాణ ఉద్యమం మళ్లీ రగిలిందని తెలంగాణ మార్చ్‌తో రుజువైందని కాగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీగౌడ్‌ అన్నారు. కవాతుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అడ్డుకోవడంపై వివరణ కోరేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లామన్నారు. అయితే సీఎం తమను పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు.