రాధారాణీ ఆలయంలో తొక్కిసలాటలు.,.. ఇద్దరి మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్లోని మధురా జిల్లా బార్సానాలోని రాధారాణి ఆలయంలో తొక్కి సలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. 12 మందికిపైగా గాయపడ్డారు. రాధాష్టమి ఉత్సవాల సందర్భంగా ఆలయానికి భక్తులు పోటేత్తడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.



