అంజయ్య మరణం బిజెపి పార్టీకి తీరని లోటు

సింగిల్ విండో డైరెక్టర్ కన్యకంటి వెంకటేశ్వర చారి
రామన్నపేట నవంబర్ 29 (జనంసాక్షి) పట్టణ కేంద్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు ఊట్కూరి అంజయ్య మరణం పార్టీకి తీరని లోటు అని బిజెపి జిల్లా మాజీ కార్యదర్శి ,సింగిల్ విండో డైరెక్టర్ కన్నెకంటి వెంకటేశ్వరాచారి అన్నారు. ఆ పార్టీ నాయకులతో కలిసి ఊట్కూరి అంజయ్య భౌతికకాయం పై పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొమ్ము యాదయ్య సీనియర్ నాయకులు కట్కూరి బిక్షపతి, ఊట్కూరి మల్లేశం, ఏలూరు రవి, చిన్నపాక స్వామి, కొమ్ము రాజు తదితరులు ఉన్నారు.